Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘సర్కారు వారి పాట’ సినిమాటోగ్రాఫర్ ని మార్చేశారు…!

‘సర్కారు వారి పాట’ సినిమాటోగ్రాఫర్ ని మార్చేశారు…!


సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో 27వ సినిమాగా ‘సర్కారు వారి పాట’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన పోస్టర్ లో మహేష్ అదరగొట్టాడు. చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. ఫ్రీ హెయిర్ స్టైల్.. మెడపై రూపాయి కాయిన్ టాటూతో ఎప్పుడూలేని విధంగా మాసీ లుక్ లో కనిపిస్తున్నాడు మహేష్. ఈ క్రమంలో నేడు మహేష్ బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఒక రూపాయి నాణెన్ని చూపిస్తూ.. దాన్ని మహేష్ టాస్ వేస్తున్నట్లుగా చూపించారు. అయితే ‘సర్కారు వారి పాట’ ప్రీ లుక్ పోస్టర్ కు మోషన్ పోస్టర్ కి చేంజెస్ కనిపిస్తున్నాయి. అదేంటంటే ఈ ప్రాజెక్ట్ సినిమాటోగ్రాఫర్ పేరు మారిపోయింది.

కాగా కృష్ణ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన ‘సర్కారు వారి పాట’ అనౌన్సమెంట్ పోస్టర్ లో ఈ సినిమాకి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారని ప్రకటించారు. అయితే నేడు మహేష్ బర్త్ డే స్పెషల్ మోషన్ పోస్టర్ లో సినిమాటోగ్రాఫర్ గా ఆర్. మధి అని పేర్కొన్నారు. అయితే కరోనా కారణంగా షూటింగ్స్ డిలే అవుతుండటంతో పీఎస్ వినోద్ డేట్స్ క్లాష్ వస్తాయని భావించి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. దీంతో గతంలో మహేష్ బాబు ”శ్రీమంతుడు” సినిమాకి అద్భుతమైన కెమెరా వర్క్ అందించిన మధి ని ఈ మూవీ కోసం ఫైనలైజ్ చేసారు. మధి ఇంతకముందు తెలుగులో ‘మిర్చి’ ‘రన్ రాజా రన్’ ‘ఘాజీ’ ‘భాగమతి’ ‘శ్రీమంతుడు’ ‘సాహో’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ గా ఏయస్ ప్రకాష్.. ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ వర్క్ చేయనున్నారు.