Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2.0 తర్వాత మరో సైన్స్ ఫిక్షన్ మూవీలో అక్షయ్

2.0 తర్వాత మరో సైన్స్ ఫిక్షన్ మూవీలో అక్షయ్


కిలాడీ అక్షయ్ కుమార్ ఏ ప్రయత్నం చేసినా అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గడిచిన రెండేళ్లలో అతడి ఎంపికలే అందుకు కారణం. వరసగా ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని బంపర్ హిట్లు కొడుతూ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. అక్షయ్ కుమార్ తన మిషన్ మంగల్ దర్శకుడు జగన్ శక్తితో ఏకం అవుతున్నారని బాలీవుడ్ హంగామా మొదలవ్వడంతో అది హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ చిత్రానికి `మిషన్ లయన్` అనే టైటిల్ ని ఖాయం చేయనున్నారట. ఇది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

`మిషన్ లయన్`కి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అక్కీ `బెల్ బాటమ్` నిర్మాత వాషు భగ్నాని నిర్మాత అని తెలుస్తోంది. బెల్ బాటమ్ కి పని చేస్తున్నప్పుడు అక్షయ్ తో వాసు బలీయమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇకపై ఆ ఇద్దరూ ప్రతి సంవత్సరం ఒక చిత్రం అయినా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణిస్తున్న ప్రతి చిత్రంతో అక్షయ్ పారితోషికం ఇంక్రిమెంట్ కు సంబంధించి వారు ఒకే క్లారిటీతో ఉన్నారట. బెల్ బాటమ్ తర్వాత మిషన్ లయన్ ఉంటుంది అని తెలిసింది. ఇదే గాక.. అక్షయ్ – వాసు భగ్నానీ మరో చిత్రం కూడా చేస్తున్నారు. పతి పత్ని ఔర్ వో దర్శకుడు ముదస్సార్ అజీజ్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ అది.

అయితే ఈ మూవీ కంటే ముందు అక్షయ్ `మిషన్ లయన్`కి పనిచేయడం ప్రారంభించాలనుకుంటున్నారట. 2021లో మిషన్ లయన్.. అటుపై 2022 లో ముదస్సార్ అజీజ్ కామెడీ మూవీని కలిసి చేయనున్నారు. 2022లో మిషన్ లయన్ విడుదలవుతుంది. పెద్ద ఎత్తున సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా మిషన్ లయన్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ 2.0 లో కిలాడీ నటించిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కేటగిరీలో ప్రశంసలు అందుకున్న ఈ భారీ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వసూళ్లను తేలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ సైన్స్ ఫిక్షన్ మూవీలో అక్షయ్ నటించడం ఇదే.