Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఫ్యామిలీ డిన్నర్.. మహేష్ – వంశీ జర్నీ కంటిన్యూస్..

ఫ్యామిలీ డిన్నర్.. మహేష్ – వంశీ జర్నీ కంటిన్యూస్..


‘సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ’ అని ‘మహర్షి’ చిత్రంలో ప్రకటించారు మహేష్-వంశీ. ఇదేవిధంగా తమ ఫ్రెండ్ షిప్ కూడా కంటిన్యూ అవుతోందంటూ చెప్పకనే చెబుతున్నారు ఈ స్టార్ హీరో డైరెక్టర్. ప్రిన్స్ మహేష్- డైరెక్టర్ వంశీపైడిపల్లి స్నేహ బంధం.. ‘మహర్షి’ తర్వాత మరింత బలపడింది. తాజాగా ఈ విషయం మరోసాారి ప్రూవ్ అయ్యింది. అవకాశం దొరికిన ప్రతిసారీ వీళ్లిద్దరి ఫ్యామిలీలు సరదాగా గడుపుతుంటాయి.

అక్కడ మీరు.. ఇక్కడ మేము అన్నట్టుగా.. మహేశ్ గారాలపట్టి సితార వంశీ కూతురు ఆద్య మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. ఈ రెండు కుటుంబాల సభ్యులు స్నేహితులతో కలిసి హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో లేటెస్ట్ గా డిన్నర్ చేశారు. అనంతరం అందూ కలిసి కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ ఫొటోని మహేష్ వైఫ్ నమ్రత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీనికి ‘ఫన్ ఫ్యామిలీస్.. నైటౌట్’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘మహర్షి’ తర్వాత వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని మహేశ్ ప్రకటించాడు. అయితే.. వంశీ వినిపించిన కథలు నచ్చకపోవడంతో మరో కథ సిద్ధం చేయాలని చెప్పినట్టు సమాచారం. ప్రిన్స్ ప్రస్తుతం పరశురాంతో కలిసి ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న విషయం తెలిసిందే.