Templates by BIGtheme NET
Home >> Telugu News >> మహిళా ఉద్యోగులకు శుభవార్త.. 10రోజుల పాటు పిరియడ్ లీవ్స్

మహిళా ఉద్యోగులకు శుభవార్త.. 10రోజుల పాటు పిరియడ్ లీవ్స్


రుతుస్రావం చుట్టూ అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో లక్షలాది మంది మహిళలు మరియు బాలికలు ఇప్పటికీ వివక్ష మరియు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కడుపునొప్పి, నడుం నొప్పి, నీరసం, చిరాకు, వాంతులు, మూడ్‌ స్వింగ్స్‌, అధిక రక్తస్రావం.. నెలసరి రోజుల్లో మహిళల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సమస్యలున్నప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుండనిపిస్తుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు ఈ రోజుల్లో కూడా విధులకు హాజరవక తప్పదు. దాంతో తప్పని పరిస్థితుల్లో నొప్పుల్ని భరిస్తూ మరీ ఉద్యోగానికి వెళ్తుంటారు మహిళలు.

దీంతో అందుకే ఈ రోజుల్లో మహిళల శారీరక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే మన దేశంలోని పలు కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు నెలసరి మొదటి రోజున వేతనంతో కూడిన సెలవును అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో జొమాటో కూడా చేరిపోయింది.2008 లో ప్రారంభమైన ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో ఇప్పుడు దేశంలోని ప్రసిద్ధ సంస్థలలో ఒకటి. ప్రస్తుతం, 5 వేలకు పైగా ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి 10 రోజుల వరకు “పీరియడ్ లీవ్” ఇస్తుందని పేర్కొంది.

పిరియడ్ లీవ్ కోసం అప్లై చేయడంలో ఎవరూ నామూషీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదన్నారు గోయల్. అంతేకాదు ఒక వేళ ఎవరైనా ఉద్యోగి ఇలాంటి లీవుల విషయంలో… వేధింపులకు గురిచేస్తే అలాంటి వాటిపై వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని గోయల్ తన మెయిల్ ద్వారా చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా పిరియడ్ లీవ్స్ వర్తిస్తాయన్నారు.

నెలసరి సమయంలో తలెత్తే శారీరక నొప్పుల కారణంగా తప్పని పరిస్థితుల్లో విధులకు హాజరవుతున్నారు చాలామంది మహిళలు. ఇలా శరీరం, మనసు సహకరించనప్పుడు పనిపై కూడా పూర్తి దృష్టి పెట్టలేరు. అందుకే ఈ రోజుల్లో మహిళల శారీరక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే మన దేశంలోని పలు కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు నెలసరి మొదటి రోజున వేతనంతో కూడిన సెలవును అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ కంపెని జొమాటో కూడా చేరిపోయింది.