Templates by BIGtheme NET
Home >> Telugu News >> మరో బ్యాడ్ న్యూస్ చెప్పిన చైనా !

మరో బ్యాడ్ న్యూస్ చెప్పిన చైనా !


ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ మనుగడపై ఇప్పటికీ ఓ సరైన అభిప్రాయానికి రావడంలేదు. అయితే ఇప్పటివరకు ఆహార పదార్థాలపై కరోనా వైరస్ ఉనికిపై ఆందోళనకరమైన సిద్ధాంతాలేవీ లేవు. కానీ తాజాగా చైనా పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. చైనా నుంచి ప్రపంచానికి స్ప్రెడ్ ఆయిన సంగతి తెలిసిందే. చైనాలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఆహార పదార్ధాలపై కరోనా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే చేపల్లో కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

ప్రపంచంలో అత్యధికులు ఎంతో ఇష్టపడి తినే చేపలు సాల్మన్ చేపలు. ఇవి ఎంతో ఖరీదైనవి కూడా. అయితే సాల్మన్ చేపల్లో కరోనా వైరస్ క్రిములు వారం రోజుల వరకు ఉంటాయని చైనా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. నాలుగు డిగ్రీల సెంటిగ్రేట్ వద్ద నిలువ ఉంచిన సాల్మన్ చేపల్లో 9 రోజులపాటు కరోనా వైరస్ జీవించి ఉంటుందని తేలింది. అలానే గది ఉష్ణోగ్రత వద్ద అంటే 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సాల్మన్ చేపల్లో రెండు రోజులపాటు కరోనా వైరస్ జీవించి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాల్మన్ చేపలను ఎగుమతి చేసే సమయంలో వాటిని ఉంచే బాక్సుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఈ విధంగా అయితే వైరస్ 6 రోజులు మనుగడ సాగిస్తుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. చైనా సీపుడ్ మార్కెట్ల ద్వారా ఈ వైరస్ రక్కసి వ్యాపించి ఉంటుందన్న వాదనలకు తాజా అధ్యయనం బలం చేకూర్చుతోంది. తడిగా ఉండే ఫిష్ మార్కెట్ నుంచి కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.