Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు..ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం!

ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు..ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం!


ఆసియా కుబేరుడు ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ తాజాగామరో సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగం సిద్ధం చేస్తునట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ వర్గాల్లో ఓ వార్త వైరల్ అవుతుంది. దాదాపుగా 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆకాష్ ఇషా అనంత్ సహా కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ ప్రణాళికలో భాగంగా ఈ కౌన్సిల్లో కుటుంబంలోని పెద్దలు ముగ్గురు పిల్లలు సలహాదారులు సలహాదారులుగా వ్యవహరించే బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. కుటుంబం లేదా వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఈ కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది చివరి నాటికీ ఈ ప్రక్రియ పూర్తి కాబోతుంది.

1973లో రియలన్స్ ను స్థాపించిన ధీరూబాయ్ అంబానీ మరణానంతరం ముకేశ్ అంబానీ అనిల్ అంబానీ మధ్య విబేధాల కారణంగా కంపెనీ రెండు ముక్కలుగా విడిపోయింది. తండ్రి ఆశయాలకు విరుద్దంగా రెండు ముక్కలు కావడం తదనంతర పరిణామల నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అంబానీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకుల అంచనా. తద్వారా విస్తారమైన రిలయన్స్ సంక్షోభంలో పడకుండా కాపాడటంతోపాటు తండ్రిగా కుటుంబ పెద్దగా విజయవంతమైన వ్యాపారవేత్తగా వారసుల విభేదాలకు సంబంధించి హిస్టరీ రిపీట్ కాకూడదనే ప్రధాన ఆశయంతో అడుగులు వేస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. కాగా ముకేశ్ నీతా అంబానీ దంపతుల సంతానం ముగ్గురూ ఉన్నత విద్యను అభ్యసించినవారే. వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నవారే. ఈ క్రమంలోనే 2014 అక్టోబర్లో ఇషా అనంత్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లో డైరెక్టర్లుగా చేరారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో కూడా వారు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వారసుల్లో చిన్నవాడు అనంత్ ఇటీవల మార్చిలో జియో ఫ్లాట్ ఫాంలో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు.