Templates by BIGtheme NET
Home >> Telugu News >> నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్.. జైలు నుంచి వచ్చిన కొద్ది గంటల్లోనే

నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్.. జైలు నుంచి వచ్చిన కొద్ది గంటల్లోనే


బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు భార్య మధుప్రియకు పోలీసులు షాకిచ్చారు. బెయిల్‌పై విడుదలైన కొద్ది గంటల్లోనే ఆమెను పోలీసులు మళ్లీ అరెస్ట్‌ చేశారు.. ఈ నెల 20 వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. ఉద్యోగాల పేరుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి మధుప్రియ రూ.25 లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. మధుప్రియ మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి.. ఆమెను మళ్లీ అరెస్ట్ చేశారు.

విశాఖ పెందుర్తి సుజాతనగర్‌లో ఉన్న నూతన్‌ కుమార్‌ నాయుడు ఇంట్లో ఆగస్టు 28న ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నూతన్ ఇంట్లో పనిచేసే కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు.. చెప్పకుండా పని మానేశాడట. దీంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం (ఆగస్టు 28) రోజు ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్‌ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేశారని.. జుట్టు తొలగించారు. దీంతో అతడు తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు, అతడి భార్య మధుప్రియతో సహా ఏడుగురి (మధుప్రియ, ఇందిరా, ఝాన్సీ , సౌజన్య, రవి, బాలు , వరహాలు)పై సెక్షన్ 307, 342, 324, 323, 506, r/w 34 ipc 3(1)(e).3(2)(v), sc,st, POA act చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ కేసులో బెయిల్‌పై వచ్చిన వెంటనే మధుప్రియ మళ్లీ అరెస్ట్ అయ్యారు.