Templates by BIGtheme NET
Home >> Telugu News >> ముంబైలో సురేష్ రైనా అరెస్ట్.. ఏంచేసాడంటే ?

ముంబైలో సురేష్ రైనా అరెస్ట్.. ఏంచేసాడంటే ?


టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్లో జరిగిన దాడిలో రైనాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు రైనాపై కేసు నమోదు చేశారు. రైనాతో పాటు గాయకుడు గురు రాంధవాను కూడా ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

అయితే అరెస్ట్ అయిన ఈ ఇద్దరూ కొద్దిసేపటికే బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ దాడిలో ముంబై క్లబ్కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని అరెస్టు చేసినట్టు సమాచారం. వీరిలో ఏడుగురు క్లబ్ సిబ్బంది కూడా ఉన్నారు. కరోనా నిబంధనలను అతిక్రమించినందుకు గానూ వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై సహర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నిర్ధారిత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉండడంతో పాటు కరోనా నిబంధనలు పాటించని నేపథ్యంలో డ్రాగన్ ఫ్లై క్లబ్పై రైడ్ చేసి 34 మందిని అరెస్టు చేశామని తెలిపారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188 269 34 ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు.