Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘లైగర్’ హీరోయిన్ ఇంట విషాదం

‘లైగర్’ హీరోయిన్ ఇంట విషాదం


విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమా లో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్స్ లో ఒక్కరు అయిన అనన్య పాండే ఇంట విషాదం నెలకొంది. ఆమె నాయనమ్మ మృతి చెందారు. ఆమె అంత్య క్రియలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అనన్య పాండే తండ్రి చంకీ పాండే తల్లి అంత్య క్రియలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆమె మృతి వార్తలు బయటకు రాలేదు. అంత్య క్రియల సమయంలో మీడియాకు విషయం తెల్సిందే. అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనన్య పాండేతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అంతా కూడా అంత్య క్రియల్లో పాల్గొన్నారు.

కొన్ని రోజుల క్రితం అనన్య పాండే తన నానమ్మ ఫొటోను షేర్ చేసింది. ఇంతలో ఇలా అవ్వడంతో అప్పటి నుండే ఆమె ఆరోగ్యం బాగాలేదని అంటున్నారు. ఆమె అనారోగ్యం తో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉండి తుది శ్వాస విడిచినట్లుగా చెబుతున్నారు.