Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎగసిపడే పాలపొంగుల మిసమిస

ఎగసిపడే పాలపొంగుల మిసమిస


మిస మిస మెరుపులతో పాల పొంగుల వయ్యారంతో మత్తు చల్లుతున్న మనోహరి అలియాస్ నోరా ఫతేహి గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ గా మన్ననలు అందుకుంటున్న ఈ విదేశీ బ్యూటీ ప్రస్తుతం సౌత్ లో స్టార్ గా సత్తా చాటేందుకు లైన్ క్లియర్ చేసుకుంటోందిట. ప్రస్తుతం ఇక్కడా క్రేజీ దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతోందిట.

నోరా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను నిలబెట్టుకుంటున్న తీరు ఆసక్తికరం. పదహారు వయసులో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని ఆదుకునేందుకు చిన్నా చితకా ఉద్యోగాలు చేశానని చెప్పుకొచ్చిన నోరా ఫతేహి తన హైస్కూల్ విద్యను కూడా త్యాగం చేశానని ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కానీ తాను అనుకున్న స్థాయిని అందుకునేందుకు నోరా ఎంతకైనా సిద్ధమేనని ప్రూవ్ చేసింది. ఒక మాల్ లో సేల్స్ గాళ్ గా పని చేసింది. టెలిమార్కెటింగ్ కార్యాలయంలో పనిచేశాక లాటరీ సంస్థలో చేరింది. ప్రజలను ఐస్ చేసి లాటరీ టికెట్లను అమ్మేదానిని అని కూడా నోరా చెప్పింది.

కానీ కెరీర్ లో అనూహ్యంగా డ్యాన్సర్ అయ్యింది. ఇండియాలో అడుగుపెట్టి బాలీవుడ్ లో ది బెస్ట్ డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన తరువాత నోరా ప్రొఫెషనల్ డాన్సర్ గా తన సోషల్ మీడియా ల్లో భారీగా అభిమానులను సంపాదించింది. 2018 లో యూట్యూబ్ లో ఒక బిలియన్ వ్యూస్ ను దాటిన హిట్ మ్యూజిక్ వీడియోలైన `దిల్ బర్`లో కనిపించింది.

బాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నోరా నటించింది. భారత్- స్త్రీ- బట్లా హౌస్- రోర్- సత్యమేవ జయతే సహా అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఇవేగాక బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగానూ నోరా సత్తా చాటుతోంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అభిషేక్ దుదయ్య తదుపరి చిత్రం `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో నోరా కనిపించనుంది. ఈ భారీ వార్ డ్రామాలో అజయ్ దేవ్ గన్- సోనాక్షి సిన్హా- సంజయ్ దత్ తదితరులతో కలిసి నటించారు. ఈ చిత్రం గత సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్ -19 పరిమితుల కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. ఈ చిత్రం 2021 ఆగస్టు 15 న విడుదల కానుంది.