Pawan Kalyan- Mahesh Multistarrer: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’. బాక్సాపీస్ వద్ద మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది ఈ చిత్రం. ఐతే, ఈ క్రేజీ సినిమాకి సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది.
అతడు చిత్ర నిర్మాత మురళీమోహన్ ఈ సీక్వెల్ పై ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు మహేష్ తో కూడా మురళీమోహన్ ‘అతడు’ సీక్వెల్ గురించి డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఇతర పనులపై కూడా ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారని టాక్ నడుస్తోంది. అయితే, ఈ అతడు సీక్వెల్ పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఈ అధికార ప్రకటన త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అతడు చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్ చేసింది. మహేష్ – త్రిష కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే, ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సునీల్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మణిశర్మ కంపోజిషన్ లో వచ్చిన పాటలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్టయ్యాయి.
నిజానికి ఈ సినిమాలో మొదట కథానాయకుడి పాత్రను పవన్ కళ్యాణ్ తో చేయిద్దామని త్రివిక్రమ్ భావించారు. అందుకు అనుగుణంగా ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని త్రివిక్రమ్ కథ చెప్పడం ప్రారంభించే సరికి ఓ అరగంట అయ్యేసరికి పవన్ కళ్యాణ్ నిద్రలోకి జారుకున్నారు. అలా పవన్ కి ఈ కథ నచ్చకపోవడంతో పవన్ ఈ సినిమా చేయలేదు.
ఆ తర్వాత ఇదే కథను మహేష్ బాబుకు వినిపించగా, మహేష్ చాలా ఆసక్తిగా విని, నచ్చి ఈ సినిమాలో నటించారు. చివరకు సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే, అతడు సీక్వెల్ ను మాత్రం పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు కలయికలో చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే.. పవన్ ది గెస్ట్ రోల్ లాగే ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ – మహేష్ కలయికలో సినిమా అంటే.. బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు ఈ సినిమా పెద్ద పండుగే అవుతుంది. మరి ఈ పండుగ ఎప్పుడు వస్తోందో చూడాలి.