Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ మరణం ధోని రిటైర్మెంట్… బాధలో మహీ ఫ్యాన్స్

సుశాంత్ మరణం ధోని రిటైర్మెంట్… బాధలో మహీ ఫ్యాన్స్


భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఆటగాడు ధోనీ. అతడిని ఆరాధించేవారు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. కేవలం ధోని బయోపిక్ లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను అంత మంది అభిమానులను సంపాదించుకున్నాడంటే అందుకు కారణం ధోనినే. సుశాంత్ ధోని అభిమానులకు ఎంతో కనెక్ట్ అయ్యాడు. ఎంతలా అంటే సుశాంత్ లో కూడా ధోనిని చూసుకునేంత. సుశాంత్ మరణం ధోని ఫ్యాన్స్ ని ఎంతో బాధించింది. సుశాంత్ మొదటగా 2008లో పలు సీరియళ్లలో నటించాడు. 2013లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ మొదట్లో సపోర్టింగ్ రోల్స్ ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు.

విజయాలు కూడా అందుకున్నాడు. అయితే అతడికే గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం ‘ధోని ది అంటోల్డ్ స్టోరీ ‘ నే. ఆ సినిమా హిందీతో పాటు దేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు ఎక్కడలేని గుర్తింపు తీసుకొచ్చింది. అభిమానులు కూడా సుశాంత్ లో ధోనిని చూసుకోవడం మొదలుపెట్టారు. మొదట సుశాంత్ ధోని బయోపిక్ లో హీరోగా ఎంపికైనప్పుడు ధోనీతో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేశాడు. అతడిని చాలా దగ్గరగా పరిశీలించాడు. ధోని ఆడిన మ్యాచ్ లు చూస్తూ షాట్లు ఆడేటప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో గమనించేవాడు.

ఆ తర్వాత ధోనీ బయోపిక్ లో అచ్చం ధోనీలా కనిపించి ఆకట్టుకున్నాడు. మంచి స్టార్డమ్ సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడడం అభిమానులను ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ ను కలచివేసింది. వాళ్లు ఆ బాధలో ఉండగానే ధోని కూడా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ధోని సుశాంత్ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. ధోని బయో పిక్ లో నటించిన సుశాంత్ ను మరోసారి తలచు కుంటున్నారు. వాట్సాప్ ఫేస్ బుక్ ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ధోని సుశాంత్ సింగ్ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.