Templates by BIGtheme NET
Home >> Cinema News >> మిషన్ పూర్తయ్యేంత వరకూ అన్నీ త్యాగాలే!- ఉపాసన కొణిదెల

మిషన్ పూర్తయ్యేంత వరకూ అన్నీ త్యాగాలే!- ఉపాసన కొణిదెల


మహమ్మారీ విజృంభణతో తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా విలయానికి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ కష్ట కాలంలో వివిధ వర్గాలకు అపోలో ఫౌండేషన్ ధాతృత్వ సేవల్ని అందించిన విషయాన్ని అపోలో ఫౌండేషన్ సి.ఎస్.ఆర్ వైస్ ఛైర్ పర్సన్ శ్రీమతి ఉపాసన కొణిదెల వివరించారు. కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. మరో రెండేళ్ళ పాటు అవసరమైన వారందరికీ తగిన సహాయ సహకారాలు అందిస్తూ అపోలో ఫౌండేషన్ ఎందరినో ఆదుకుందని తెలిపారు.

అరగొండ వికాస్ ట్రస్ట్ ద్వారా దాదాపు రెండు లక్షల ఫేస్ మాస్క్ లు తయారు చేసి అందించామని వెల్లడించారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలానికి చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రభుత్వోద్యోగులు 60వేలకి మందికి పైన మాస్క్ లు ఉచితంగా అందజేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అరగొండ వికాస్ ట్రస్ట్ స్కిల్ సెంటర్ ద్వారా 1238 పి.పి.ఇ కిట్స్ ఇచ్చాం. అరగొండ పరిసరాల్లోని 45గ్రామాలకు చెందిన ప్రజలకు ఉచితంగా నిత్యవసరాలు.. కూరగాయలు.. వైద్యసహాయం అందజేశాం.

అరగొండ మండలంలోని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ సిబ్బందికి 3000ఫేస్ మాస్క్ లు ఇచ్చాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కి అనుబంధంగా అపోలో ఫౌండేషన్..ఆంధ్రప్రదేశ్..తెలంగాణా రాష్ట్రాలకు చెందిన నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్..అంబ్రాబార్ టైగర్ రిజర్వ్ ప్రాంతాలకు చెందిన 500మంది చెంచు తెగల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు అంజేశాం.. కోవిడ్ రిలీఫ్ సపోర్టర్స్ దాదాపు 3000మంది ఉచితంగా హెల్త్ కిట్స్..నిత్యవసర వస్తువులు అందజేశాం. ప్రాజెక్ట్ స్టే లో భాగంగా ముంబయి..ఢిల్లీ..బెంగుళూరు ప్రాంతాల్లోని ఐసోలేషన్ సెంటర్లలో 3009 బెడ్ డేస్ ఉచితంగా ఏర్పాటు చేశాం. కోవిడ్19 సేఫ్టీ మాన్యువల్ ఎంతో పరిశోధించి రూపొందించాం. బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు.. తెలంగాణా..కర్ణాటక..ఢిల్లీ ప్రాంతాల్లోని 123ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు 7397 తిరిగి యూజ్ చేసుకునే ఫేస్ మాస్క్ లు అందజేశాం. అలాగే 138 ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోని ముసలివారికి రెగ్యులర్ మెడికేషన్ తో పాటు 174000జింక్ టాబ్లెట్లు ఉచితంగా అందజేశాం. రోగులకు మెడిసిన్స్ రాత్రింబవళ్ళు అందించడానికి అపోలో ఫార్మసీకి చెందిన దాదాపు 30వేల మంది ఉద్యోగులు నిర్విరామంగా శ్రమించారు అని తెలిపారు.

15మిలియన్ల ఫ్రీ రిస్క్ స్కాన్స్ చేశారు. 1మిలియన్ టెలికౌన్సిలింగ్..అపోలో టెలిహెల్త్ ద్వారా ఉచితంగా చేసామని తెలిపారు. ఈ తరం కోసం మాత్రమే చేస్తున్న యుద్ధం కాదు. వచ్చే తరాల శ్రేయస్సు కోసం చేస్తున్న యుద్ధం. మిషన్ పూర్తయ్యేంతవరకు విశ్రాంతి లేకుండా..అన్ని త్యాగాలకు సిద్ధపడి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక అపోలో ఉద్యోగుల కుటుంబాలకు అన్నివిధాలా కోవిడ్ సమయంలో అండగా నిలిచామని వెల్లడించారు. కార్పొరెట్ ఆస్పత్రులు కోవిడ్ పేరుతో దోచుకుంటున్నాయన్న విమర్శల నడుమ ఉపాసన ఇచ్చిన ఈ సుదీర్ఘ వివరణపై ఆసక్తికర చర్చ మొదలైంది.