దిల్లీ నిర్భయ అత్యాచారంపై సిరీస్ కి అరుదైన అవార్డ్

అంతర్జాతీయ సినీయవనికపై ఎమ్మీ అవార్డ్స్ కి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసినదే. 2020 ఎమ్మీ అవార్డ్స్ ని నేడు ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్ తో మెరుపులు మెరిపించింది. షెఫాలి షా – రాజేష్ తైలాంగ్తో పాటు షో రచయిత దర్శకుడు రిచీ మెహతా – హెచ్ టి సిటీ ఎడిటర్ మోనికా రావల్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2020 లో ఉత్తమ డ్రామా సిరీస్ కు అవార్డును గెలుచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు గురించి వారంతా మాట్లాడారు.

నెట్ఫ్లిక్స్ లో మార్చి 2019 లో విడుదలైన ఈ సిరీస్ 2012 లో దిల్లీ(ఢిల్లీ)లో జరిగిన దారుణమైన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు ఆధారంగా రూపొందించారు. షా మహిళా అధికారి ఇన్ చార్జిగాను.. వర్తికా చతుర్వేది తైలాంగ్ భూపేంద్ర సింగ్ పాత్రలో నటించారు.

ఈ సిరీస్ కి ప్రస్తుతం దర్శకనిర్మాతలు సీజన్ 2 ని తెరకెక్కించే ఉత్సాహంతోనూ ఉన్నారు. ఎమ్మీ ఉత్తమ సిరీస్ అవార్డుతో మరింత ఉత్సాహంగా టీమ్ ప్లాన్ చేస్తోందట.

Related Images:

‘ఎఫ్ 2’ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డ్…!

కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ 2019కి గానూ వివిధ భాషలకు చెందిన పలు సినిమాలకు అవార్డులు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనికి సంబందించిన గెజిట్ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ”ఎఫ్ 2 : ఫన్ అండ్ ఫస్ట్రేషన్” చిత్రానికి కేంద్ర అవార్డు లభించింది. ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ‘F2’కు ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో తమిళ్ నుంచి ‘హౌస్ ఓనర్’.. హిందీ నుంచి ‘ఉరి’ ‘గల్లీ బాయ్’ ‘సూపర్ 30’ ‘బదాయి హో’.. మలయాళం నుంచి ‘జల్లికట్టు’ సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. అయితే ఈ అవార్డు సాధించిన ఏకైక తెలుగు సినిమా ‘ఎఫ్ 2’ కావడం విశేషం.

కాగా గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. థియేటర్ లోనే కాకుండా టీవీలోనూ ఈ మూవీ మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా – మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్ – ప్రకాష్ రాజ్ – సుబ్బరాజు – ప్రగతి – నాజర్ – అన్నపూర్ణమ్మ – వై. విజయ – అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ‘ఎఫ్ 2’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ ని పట్టాలెక్కించడానికి సన్నాహకాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Images: