మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘హే ఇది నేనేనా..’ అనే మరో సాంగ్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఐదు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
కాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని సమ్మర్ లో సోలోగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ కరోనా కారణంగా కుదరలేదు. కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుండటంతో థియేటర్స్ ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. దీంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన ”వి” సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ మేకర్స్ కూడా అదే దారిలో ఆన్లైన్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారని.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5 ఒరిజినల్’లో స్ట్రీమింగ్ కాబోతోందని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై సాయి ధరమ్ తేజ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం క్రైసిస్ లో ప్రొడ్యూసర్స్ పరిస్థితిని అర్థం చేసుకొని సాయి ధరమ్ తేజ్ తన సినిమాని ఓటీటీ విడుదల చేయడానికి ఒప్పుకున్నాడట. కాకపోతే ‘సోలో బ్రతుకే’ ని తెలుగులో అంతగా క్రేజ్ లేని జీ5 ఓటీటీలో రిలీజ్ చేయడం పైన మాత్రం తేజ్ అసంతృప్తిగా ఉన్నాడట. ప్రెజెంట్ వ్యూయర్ షిప్ లో ముందున్న అమెజాన్ ప్రైమ్ లేదా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తన సినిమాని రిలీజ్ చేయాలని తేజ్ మేకర్స్ కి సూచిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘హే ఇది నేనేనా..’ అనే మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మంచి ఆదరణ తెచ్చుకుని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో సాంగ్స్ తో హిట్ కొట్టారు.. సినిమా కూడా హిట్ కొడతారంటూ మెగా అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం దీని గురించి నీరసమైన సమాధానాలు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.
కాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని సమ్మర్ లో సోలోగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ కరోనా కారణంగా కుదరలేదు. కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుండటంతో థియేటర్స్ ఇప్పట్లో రీ ఓపెన్ చేసేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని – సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన ”వి” సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెగా హీరో సినిమాని కూడా అదే విధంగా ఆన్లైన్ లో రిలీజ్ కి ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్లేననే న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అందుకే ఈ సినిమాకి ఎంత క్రేజ్ తీసుకొచ్చి ఏం లాభం చివరకు ఓటీటీ రిలీజ్ చేస్తుంటే అంటూ పెదవి విరుస్తున్నారట. ప్రస్తుతం బాగా క్రేజ్ తెచ్చుకుని ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల పట్ల కొందరు హీరోలు మరియు వారి సన్నిహితులు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ మూవీని థియేటర్స్ లోనే విడుదల చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ పై సెప్టెంబర్ లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా నాని నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వి’ సినిమాని ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో ‘వి’ విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే మంచి డీల్ కుదరడంతో ఆ న్యూస్ నిజం చేస్తూ ‘వి’ మూవీని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా నాని స్టార్ డమ్ పేరు చెప్పుకొని ఫ్యాన్సీ ఆఫర్ కి ఓటీటీకి అమ్మిన ‘వి’ సినిమాలో నాని కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేశాడని టాక్ వినిపిస్తోంది. రీసెంటుగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తోంది. సెన్సార్ అయినప్పటి నుంచి ‘వి’ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తన భార్యను హతమార్చిన వారిని చంపుతూ.. అక్కడ ‘వి’ అనే మార్కును నాని వదిలి వెళుతుంటాడని.. ఈ కేసును చేధించే బాధ్యతలు సుధీర్ బాబు తీసుకొని చివరకు నాని ని పట్టుకుంటారని ఓ స్టోరీ చెప్తోంది. అయితే దిల్ రాజ్ కూతురు ఇంస్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేసిన ‘వి’ ఇంటర్వెల్ స్నాప్ ని బట్టి మరో స్టోరీ అల్లేశారు. పోలీసుగా ఉన్న సుధీర్ బాబు మెయిన్ విలన్ అని.. నాని ని విలన్ అని చూపించినప్పటికీ ఇంటర్వెల్ లో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుందని అంటున్నారు.
ఏదేమైనా ‘వి’ లో నాని సినిమా మొత్తం మీద కేవలం 25 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని అంటున్నారు. అయితే మేకర్స్ మాత్రం నాని ‘వి’ అంటూ పాపం అమెజాన్ వారికి అంటగట్టారని.. ‘వి’ సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి అసలు కారణం ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ‘వి’ మేకర్స్ ఇప్పటి వరకు మాయ చేసారా.. అమెజాన్ ప్రైమ్ వారు మోసపోయారని వస్తున్న కామెంట్స్ నిజమా కాదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.