అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆరంభమే తనదైన నటనతో ఆకట్టుకున్న జాన్వీ .. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి చిన్నకుమార్తె జాన్వీ సోదరి ఖుషీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా పెళ్లిసందడి చిత్రంతో ఈ యంగ్ బ్యూటీ బరిలో దిగుతోందన్నది వేడెక్కిస్తోంది. అయితే ఇది నిజమా? అంటే దానిపై సరైన క్లారిటీ లేదు.
నిజానికి శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రం `పెళ్లిసందడి`ని అతడి వారసుడు రోషన్ తో రీమేక్ చేసేందుకు కె.రాఘవేంద్రరావు చాలాకాలంగా ప్లాన్ లో ఉన్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని 1996లో రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆహ్లాదకరమైన స్క్రీన్ ప్లే.. కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్ వర్కవుటై…అంతటి విజయం సాధ్యమైంది. వైజయంతి అధినేత అశ్వనీదత్ తో కలిసి అల్లు అరవింద్ ఆ సినిమాని నిర్మించారు.
నాటి క్లాసిక్ లో రవళి- దీప్తీ భట్నాగర్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ప్రస్తుతం సీక్వెల్ ని రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఇపుడు తెరకెక్కించబోతున్నారు. దాదాపు 25 ఏళ్ల తరువాత ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న ఈ చిత్రానికి `పెళ్లిసందD` అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించనున్నాడు.. ఇక హీరోయిన్ గా ఎవరు నటిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళ నటి మాళవికా నాయర్ నటిస్తునందని ప్రచారం జరిగింది.
కానీ తాజా సమాచారం ప్రకారం రోషన్ కు జోడీగా శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ నటించనుందని ప్రచారం మొదలైంది. ఖుషీ కపూర్ తెరంగేట్రం నిజమా కాదా? అన్నదానికి అధికారిక సమాచారం అయితే లేదు. ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే ఈ మూవీ టీమ్ స్పందించాల్సిందే.
ఆర్కా మీడియా సమర్పణలో కె. రాఘవేంద్రరావు సోదరుడు కె. కృష్ణమోహన్రావు నిర్మించబోతున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ మూవీకి గౌరీ రోనన్ కి దర్శకత్వం వహించనున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం అనంతరం జాన్వీ.. ఖుషీ కపూర్ విషయంలో పాపా(డాడీ) బోనీకపూర్ ప్రతి సందర్భంలోనూ ఎంతో ఎమోషనల్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరినీ కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. ఇక అన్నగారు అర్జున్ కపూర్ అయితే చెల్లెళ్లపై ఈగను కూడా వాలనివ్వడం లేదు. చెల్లెళ్లను ఎంతో మురిపెంగా లాలనగా చూసుకుంటూ శభాష్ అనిపిస్తున్నాడు.
అదంతా సరే కానీ.. ఈ లాక్ డౌన్ లో బోనీ ఫ్యామిలీ ఎఫైర్స్ గురించి తెలుసుకోవాలనుంటే ఇదిగో జాన్వీ కపూర్ గురించి డీప్ గా తెలుసుకోవాలి. జాన్వి – ఖుషి కపూర్ సిస్టర్స్ లాక్ డౌన్ అంతటా తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. కపూర్ గాళ్స్ ఇద్దరూ ఈ ఖాళీ సమయంలో పెయింటింగ్ ద్వారా వారి సృజనాత్మకతను పెంచుకున్నారు.
ఈ విషయాన్ని నిర్మాత బోనీ కపూర్ స్వయంగా ట్విట్టర్ లో రివీల్ చేశారు. జాన్వి – ఖుషీ గీసిన కొన్ని చిత్రాలను ట్వీట్ చేసి `గర్వంగా..` అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పెయింటింగ్స్ చూస్తుంటే ఇందులో ఖచ్చితంగా మగువల మనసులో ఏదో కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే తల్లిని కోల్పోయిన కూతుళ్ల ఆవేదనా పూరితమైన మనస్తత్వం ప్రతిబింబిస్తోంది. ఆధ్యాత్మిక చింతనతో ఊరట చెందుతున్న సంగతి అర్థం స్ఫురిస్తోంది. జాన్వి చివరిసారిగా నెట్ ఫ్లిక్స్ చిత్రం `గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్` లో కనిపించారు. తదుపరి `రూహి అఫ్జానా`.. `దోస్తానా 2` చిత్రాల్లో కనిపించనున్నారు.