Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ అలర్ట్ .. అన్నీ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 12దేశాల్లో మంకీపాక్స్‌ వ్యాపించింది. మొదటల్లో ఒకటి రెండు కేసులతో మొదలై ఇప్పుడు వెయ్యికి చేరువ అవుతోంది. ఈనేపధ్యంలోనే భారత్‌లోనూ మంకీ పాక్స్‌ కలవరం మొదలైంది. ఈ కొత్తరకం వ్యాధి కేసుల్ని గుర్తించడం, బాధితులకు ట్రీట్‌మెంట్‌ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటోంది కేంద్రం. ఈపరిస్థితుల్లోనే తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. మంకీపాక్స్‌ బాధితులను గుర్తించాలని..ఒకవేళ ఎవరైనా లక్షణాలు కలిగి ఉంటే వారిని 21 రోజులు ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించింది. మంకీపాక్స్‌ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లక్షణాలు 2-4 వారాల్లో తగ్గిపోతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

అన్నీ ఆసుపత్రుల్లో చికిత్స ఏర్పాట్లు..

మంకీపాక్స్‌ గుర్తించాల్సిన లక్షణాలను సైతం గతంలోనే వెల్లడించారు అధికారులు. జ్వరం, శరీరం, ముఖంపై పెద్ద పెద్ద దద్దుర్లు, చర్మంపై బుడగలు వస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని సూచిస్తున్నారు. అనుమానితుల రక్త నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీకి పంపిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే 21రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉంచాలని ఆదేశించారు. చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స పొందాలని తెలిపింది. ఒకరి నుంచి మరొకరికి మంకీపాక్స్‌ సోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చిన వాళ్లతో పాటు వారిని కాంటాక్ట్ అయిన వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించవచ్చని అధికారులు అలర్ట్ చేశారు. ,

భయపెడుతున్న వైరస్..

బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెన్యా, అమెరికా సహా 45 దేశాల్లో మంకీపాక్స్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. మంకీ పాక్స్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్నికేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్‌ వైరస్‌ని కట్టడి చేయడానికి పనిచేస్తాయా లేదా అనే దానిపై రీసెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మంకీపాక్స్‌ సోకిన వారికి అమ్మవారు పోసినప్పుడు చేసే ట్రీట్‌మెంట్‌నే అందిస్తున్నారు. ఇది 85శాతం ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు.

Related Images:

కరోనాకి ఖంగు తినిపించే జపాన్ ట్రీట్మెంట్ !

కరోనా ప్రపంచాన్ని భయపెడుతుంటే ..జపాన్ మాత్రం తన ట్రీట్మెంట్ తో ఏకంగా కరోనానే భయపెట్టాలని చూస్తుంది. అదేంటి కరోనా ఏమైనా వ్యక్తి జంతువు కాదు కదా వాళ్లు భయపెట్టడానికి అని అనుకుంటున్నారా ! మీరు అనుకున్నది నిజమే కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటి అంటే .. ప్రస్తుతం కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు ప్రపంచమంతా ఓ పెద్ద యుద్ధం చేస్తోంది. అయితే జపాన్ మాత్రం కరోనా ట్రీట్మెంట్ లోనూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు భయంతో ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని సెంట్రలైజ్ చేసింది. అంతే.. భయాన్ని పోగొట్టే ఆలోచన చేసి ఒక సంస్థ ‘స్కేర్ స్క్వాడ్’ అనే షోకి శ్రీకారం చుట్టింది.

ఈ స్కేర్ స్క్వాడ్ షో 15 నిమిషాల సేపు ఉంటుంది. ఇందులో భాగంగా కస్టమర్ ను శవపేటికలో పడుకోబెడతారు. ఆ పెట్టెలో భయానక అరుపులు..ఆహాకారాలు.. ఇలా రకరకాలుగా అతన్ని భయపెడుతుంటారు. అంతేకాదు మధ్యమధ్యలో దెయ్యాల వేషాలతో .. బాక్స్ విండో తీసి మరీ భయపెట్టి లోపల ఉన్న వాళ్లని పీక్ స్టేజ్ కు తీసుకెళ్తుంటారు. అంతే ఆ కరోనా బాధితుడు కరోనా విషయాన్నే మర్చిపోతాడనేది షో ఆర్గనైజర్ల ఆలోచన. ఏదేదో బాగుంది కదా .. అయితే ఈ షో టిక్కెట్ ఎంతంటే.. 8 అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీ లో దాదాపు ఆరు వందల రూపాయలు.

Related Images: