బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ జీవితంలో ఉత్థానపతనాల గురించి తెలిసిందే. డ్రగ్స్ వెపన్స్ అంటూ కేసులతో అతడి జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ డేస్ జైల్లోనే కరిగిపోయాయి. సరిగ్గా ఆయన జైల్లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచారు మాన్యత. కష్టంలో అతడి వెంటే నిలిచిన ప్రేమికురాలిగా మాన్యత గురించి బోలెడంత ప్రచారమైంది.
ఇక దత్ జైలు జీవితం విడిచి తిరిగి ఇంటికి చేరుకున్నప్పటి నుంచి మాన్యత పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడిపారు. ప్రస్తుతం వరుసగా సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ఊహించని పిడుగులా క్యాన్సర్ మహమ్మారీ దత్ ని వేధించింది. మూడో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ అతడిని తరుముకొచ్చింది.
ఇక మాన్యత దత్ కి ఎంతో సేవలు చేస్తూ ఆయన కోలుకునేలా చేస్తూ ఉత్తమ భార్యగా మెలుగుతోంది. ఆలితోనే అన్నీ.. ఇల్లే స్వర్గం అన్నంతగా దత్ రిలాక్సయిపోతున్నారంటే అర్థం చేసుకోవాలి. మాన్యత పిల్లలతో సరదాగా గడుపుతూ దత్ చాలా ఊరట చెందుతుంటారు. అన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడి కుటుంబ జీవనంతో ఎంతో మారాడని అంటారు.
ఇక మాన్యత రెగ్యులర్ గా సోషల్ మీడియా పోస్టింగులతో తమ సంసార జీవనంపై అప్ డేట్స్ ఇస్తుంటారు. ఇదిగో ఇలా తరచూ తన అభిమానుల కోసం ఆసక్తికరమైన పోస్టులను పంచుకుంటోంది.
ప్రస్తుతం తన పిల్లలు షహ్రాన్- ఇక్రాలతో కలిసి దుబాయ్ లో ఉన్న సంజయ్ దత్ భార్య మాన్యత తన భర్త పిల్లలతో కొంత విలువైన సమయాన్ని గడుపుతున్నందున ఆ విషయాల్ని వెల్లడిస్తోంది.
ప్రస్తుతం మాన్యత మండే మోటివేషన్ వైరల్ గా దూసుకెళుతోంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ తో విజయవంతంగా పోరాడిన సంజయ్ దత్ ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించినన భారీ యాక్షన్ చిత్రం భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించనున్నారు. ఈ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అజయ్ దేవ్గన్- సంజయ్ దత్- సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యష్ కేజీఎఫ్ లోనూ అధీరా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
కంటికి కనిపించని మహమ్మారి ప్రపంచాన్ని వణికేలా చేయటం తెలిసిందే. దగ్గర దగ్గర ఏడాది కాలంగా ఈ అంశం మానవాళికి మింగుడుపడనిది మారింది. రానున్న మరికొన్ని నెలల పాటు ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ఓవైపు కరోనా వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశకు వచ్చిందని చెప్పినప్పటికీ.. అది బయటకు వచ్చి.. సగటు జీవి చెంతకు చేరేసరికి చాలానే సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. కరోనా టెన్షన్ ప్రతి ఒక్కరిని వెంటాడి వేధిస్తోంది. ఈ మహమ్మారి పుణ్యమా అని ఎక్కడికి వెళ్లాలన్న సందేహం.. ఎవరిని కలవాలన్న భయం.. ఆందోళన వెంటాడుతోంది. కొందరు వీటిని పట్టించుకోకుండా తిరిగేస్తుంటే.. చాలా ఎక్కువమంది మాత్రం నిపుణుల సూచనల్ని.. ప్రభుత్వం చెబుతున్న అంశాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇలాంటివేళ.. చైనాపరిశోధకులు కరోనా కారణంగా తలెత్తుతున్న కుంగుబాటు.. మానసిక ఆందోళన నుంచి బయటపడేందుకు కొత్త సూత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ప్రాక్టికల్ గా దీన్ని పాటిస్తున్న పలువురు అద్భుతమైన ఫలితాల్ని సొంతం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇంతకూ వారు చెబుతున్న టెక్నిక్ ఏమిటంటే.. ప్రతి రోజు 45 నిమిషాల పాటుకఠినమైన వ్యాయామం.. శారీరక శ్రమ చేయటానికి మించింది లేదంటున్నారు. రెక్కలు ముక్కలయ్యేలా కఠినమైన వ్యాయామం ముప్పావు గంటపాటు ఏం చేస్తామనుకుంటే.. కాస్త తేలికపాటి వ్యాయామం చేయాలని ఫిక్స్ అయితే 108 నిమిషాలు (అటుఇటుగా గంటన్నర) చేస్తే సరిపోతుందంటున్నారు. ఇలా వ్యాయామం మీద ఫోకస్ పెడితే.. ఆందోళనలు పక్కకు వెళ్లిపోతాయంటున్నారు.
ఈ సూత్రాన్ని ప్రతిపాదిస్తున్న చైనా కాలేజీ విద్యార్థులు.. తమపై తాము ప్రయోగం చేసుకున్నారట. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇలా వ్యాయామాన్ని ఫాలో అయిన వారిలో ఏ ఒక్కరికి కరోనా బారిన పడలేదంటున్నారు. దీనికి కారణం ఏమిటి? శాస్త్రీయమైన అంశాలేమిటి? అన్న విషయంలోకి వెళితే.. వ్యాయామం.. శారీరక శ్రమతో మెదడులో డొపమైన్ వంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రసాయనాలు ఎక్కువగా విడుదలవుతాయని.. ఇవి ఉత్సాహాన్ని.. హుషారును కలిగిస్తాయని చెబుతున్నారు. ఏకాగ్రత పెరగటం వల్ల లేనిపోని ఆలోచనలు.. భయాలు మనసును వేధించవని చెబుతున్నారు. వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నొక్కి చెబుతోంది. మరిక ఆలస్యం ఎందుకు.. వెంటనే 45 నిమిషాల వ్యాయామాన్ని షురూ చేయండి.