బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐ చెంతకు చేరింది. అక్కడ విచారణ సందర్బంగా కూడా ఈ కేసుతో డ్రగ్స్ జోక్యం ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందని ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు అయిన శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నేడు రియా చక్రవర్తిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ విషయమై రియా చక్రవర్తి తరపు లాయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కక్ష సాధింపు చర్య అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రియా అరెస్ట్ అయిన తర్వాత ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ.. న్యాయం ఓడిపోయింది. డిప్రెషన్ తో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇల్లీగల్ మందులు వాడి డ్రగ్స్ కూడా అలవాటు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని రియా ప్రేమించింది. అలాంటి వ్యక్తిని ప్రేమించినందుకు రియాను మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒకేసారి మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆమెను టార్గెట్ చేయడంతో న్యాయం ఓడిపోయింది.
విచారణ పేరుతో ఆమెను తీవ్రంగా హింసించారు.. వెంటాడారు అంటూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలపై ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. ఒక లాయర్ అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆయన తీరును ప్రశ్నిస్తున్నారు. వారు నిర్దోషులు అయితే నిరూపించి బయటకు తీసుకు రమ్మంటూ సుశాంత్ అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం వెనక కారణాలపై సీబీఐ ఆరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు నేడు ప్రశ్నల పరంపరతో ఉక్కిరి బిక్కిరి చేశారని తెలుస్తోంది. ముంబై డీఆర్.డీఓ అతిథి గృహంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించారు.
అసలు సుశాంత్ తో పరిచయం.. ప్రేమ.. బ్యాంక్ ఖాతాల లావాదేవీలు .. అతడి ఖాతా నుంచి ఎవరి ఖాతాలకు డబ్బు జమ అయ్యింది.. వగైరా వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే సుశాంత్ ని పెళ్లాడాలనుకున్నారా? అంటూ సీబీఐ అడిగిన ప్రశ్నకు రియా ఎలా స్పందించారు అన్నది తెలియాల్సి ఉంది. ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ చక్రవకర్తిని కూడా అధికారులు విచారిస్తున్నారు.
రియా.. ఆమె సోదరుడు సహా పలువురుని సీబీఐ ప్రశ్నిస్తోంది. సుశాంత్ క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని.. వంట మనిషి నీరజ్ సింగ్ .. పని మనిషి కేశ్.. ఇంటి మేనేజర్ శ్యామ్యుల్ మిరిండా లను కూడా సీబీఐ ఆరాలు తీస్తోంది. ఇక సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతాల నుంచి దాదాపు 15 కోట్లు కనిపించకుండా పోయిందని అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపిస్తున్నారు. బిహార్ లో కేసు కూడా నమోదు చేశారు. ఇక డ్రగ్స్ మాఫియాతో రియా పరిచయాల గురించి ఇతరత్రా యాక్టివిటీస్ గురించి పలు ఆధారాలు లభించడంతో దానిపైనా సీబీఐ విచారిస్తోంది. ఇక సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని .. తను ఎవరి మాటా వినని వాడని రియా ఇంతకుముందు మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మునుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది ఉత్కంఠను పెంచుతోంది.