మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. తర్వాత చేయబోయే మూడు ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదలమ్’ తెలుగు రీమేక్ లో చిరు నటించనున్నాడు. అలానే మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ లో కూడా మెగాస్టార్ లైన్ లో పెట్టాడు. వీటితోపాటు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే దర్శకులనైతే లైన్ లో పెట్టాడు కానీ స్క్రిప్ట్స్ విషయంలో మాత్రం చిరు ని మెప్పించలేకపోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలు ముందుగా యువ దర్శకుడు సుజీత్ చేతిలో పెట్టారు. అయితే సుజీత్ మార్పులు చేర్పులు చేసిన స్క్రిప్ట్ తో చిరంజీవిని మెప్పించలేకపోయాడని.. అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కి స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించారు. అయితే వినాయక్ రెడీ చేసిన స్టోరీ కూడా నచ్చకపోవడంతో ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ చేరిందని టాక్ నడుస్తోంది. అలానే తాజాగా బాబీ కూడా మెగాస్టార్ ని మెప్పించలేకపోయాడని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. గతేడాది వెంకటేష్ – నాగచైతన్య లతో ‘వెంకీమామ’ సినిమా తీసి సక్సెస్ అయిన బాబీ ని అదే తరహాలో భావోద్వేగాలతో కూడిన ఎంటర్టైనర్ ని సిద్ధం చేయమని చిరు కోరాడట. అయితే బాబీ చెప్పిన స్టోరీ చిరంజీవి ని మెప్పించలేకపోయిందట. మరి రాబోయే రోజుల్లో ఈ దర్శకులు తమ స్క్రిప్ట్ వర్క్ తో మెగాస్టార్ ని ఇంప్రెస్ చేస్తారేమో చూడాలి.
Megastar Chiranjeevi was tested negative for Coronavirus recently and he is currently back onto the sets of his next film ‘Acharya’ directed by Koratala Siva. There are a lot of expectations over this social drama and Chiru agreed to another two remakes.
Chiru is going to have a stylish makeover for ‘Acharya’ and fans are very happy over his appearance. He recently shot for Samantha’s talk show ‘Sam Jam’ and he looked amazing with a cool hairstyle and trendy yet decent suit. Megastar even posed in a selfie with talented young actor Viva Harsha too. These clicks are currently going viral and fans can’t get enough of Megastar’s cool and casual look.
As we know, Samantha started her own talk show titled ‘Sam Jam’ which is streamed on ‘Aha’. After Vijay Devarakonda, Megastar is going to appear on her show. Megastar looked perfect while Sam is definitely leaving everyone awestruck with her amazing fashion sense. Let us wait to find out what Chiru revealed during his interaction with Sam.
మరోసారి హైదరాబాద్ శివారులో తెలంగాణ సర్కారు నుంచి వరల్డ్ క్లాస్ ఫిలింసిటీ ప్రస్థావన వచ్చింది. తెలంగాణ విభజన అనంతరం పలుమార్లు చర్చకు వచ్చిన ఈ అంశానికి ఎట్టకేలకు పూర్తి క్లారిటీ వచ్చేయనుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ పెద్దలు చిరంజీవి.. నాగార్జున భేటీ అవ్వడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇంతకీ చిరు.. నాగ్ ఎందుకని కలిశారు? అంటే దీనివెనక చాలా పెద్ద కారణమే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ శివారులో దాదాపు 2000 ఎకరాల్లో భారీ ఫిలింసిటీ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ ఇద్దరూ చర్చించారన్న వార్త ఫిలింవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కేసీఆర్ నుంచి అనుమతి లభించిందన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ తో ఈ సమావేశంలో ఆర్.అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్- రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్- ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. ముఖ్య కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటిలో కేసీఆర్ ఫిలింసిటీ కోసం 1500 – 2000 ఎకరాల కేటాయిస్తామని అన్నారని తెలుస్తోంది. ఫిలిం సిటీ నిర్మాణానికి ముందు సినీ ప్రముఖులు.. అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి ఫిలిం సిటీని పరిశీలించి రావాలని.. సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని సీఎం అన్నారు. అలాగే సినీకార్మికుల్ని ఆదుకునేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 10లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారిని ఆదుకోవాలని కేసీఆర్ అన్నారు. అలాగే థియేటర్లను పునఃప్రారంభించే ఆలోచన ఉందని తెలిపారు.
ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వమే 1500- 2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్ అవసరాలకు తగ్గ ఇంటర్నేషనల్ స్టూడియోల నిర్మాణానికి అనుమతించనున్నామని సీఎం వెల్లడించారు.
కరోనాతో సర్వం బంద్ అయిపోయింది. సినీ పరిశ్రమ అయితే మూతపడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా టాలీవుడ్ అగ్రహీరోలు మాత్రం బయటకు రాకుండా సినిమా షూటింగ్ లకు దూరంగానే ఉంటున్నారు.
తాజాగా ఆదివారం సెలవు కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి సేదతీరారు. వారికిష్టమైనది వండి పెట్టి ముచ్చట తీర్చుకున్నారు.
మెగా స్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి ఈ ఆదివారం పూట కే.ఎఫ్.సీ చికెన్ తయారు చేశారు. ఈ మధ్యనే దోశలు వేసి తన పాక పోషణను చాటిన చిరంజీవి తాజాగా తన మనవరాళ్లతో కలిసి కే.ఎఫ్.సీ చికెన్ తయారు చేసి ఆకట్టుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనవరాళ్లు నివ్రితి సంహితలతో కలిసి కెఎఫ్సి చికెన్ తయారు చేసిన వీడియోని పోస్ట్ చేశారు. ‘రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు రుచిగా ఏమన్నా చేయగలిగితే…ఆ కిక్కే వేరప్పా..’ అంటూ చిరు ఈ వీడియోని షేర్ చేశారు.
కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ను తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు చిరంజీవి కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆదివారం మనవరాళ్లతో ఆహ్లాదంగా గడిపారు. ఈ వీడియోలో నివ్రితి సంహితలు బోర్ కొడుతుంది.. కెఎఫ్సి చికెన్ తినాలని ఉంది అని సంహిత అనగా.. బయట పరిస్థితులేమీ బాగోలేదు.. ఇంట్లోనే తయారు చేసుకుందాం.. అని చిరు చెప్పారు. మనవరాళ్లు సహాయం చేయగా.. చిరంజీవి అన్నీ రెడీ చేసి కేఎఫ్సీ చికెన్ తయారు చేశారు.మనవరాళ్లకే కాదు.. ఫ్యాన్స్ కూడా చిరు పాకశాస్త్రం గురించి తెలిసేలా చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నందమూరి బాలకృష్ణ నటించి దర్శకత్వం వహించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల`. గత కొన్నేళ్ల క్రితం ప్రారంభ దశలోనే ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కేవలం 17 నిమిషాల ఫుటేజీని శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల బాలయ్య స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ద్వారా వచ్చే మొత్తంలో కొంత భాగాన్ని చారిటీకి అందజేయబోతున్నారు. ఇక ఇప్పటికే ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంది.
ఇదిలా వుంటే ఇదే తరహాలో మధ్యలో ఆగిపోయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన `అబు బాగ్దాద్ గజదొంగ` ని కూడా రిలీజ్ చేస్తారా అనే చర్చ మొదలైంది. మెగా ఫ్యాన్స్ ఈ మూవీకి సంబంధించిన క్లిప్స్ ని ఇప్పటికైనా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 90వ దశకంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇండియన్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేసి తొలి భారతీయ చిత్రమిది. అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో 50 కోట్ల భారీ వ్యయంతో ఈ మూవీని ప్లాన్ చేశారు.
చిరు గెటప్ కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయితే కొంత మంది ముస్లీమ్ నేతల ఒత్తిళ్ల కారణంగా ఈ మూవీ అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఎలాంటి క్లిప్ బయటికి రాలేదు. ఈ మూవీని పూర్తి చేయాలని చిరు డ్రీమ్ కానీ అది నెరవేరలేదు. రామ్చరణ్ ఈ చిత్రాన్ని మళ్లీ రివైవ్ చేయాలని ప్రయత్నించినా చిరులో మార్పులు రావడంతో ఇది అసాధ్యమని పక్కన పెట్టేశారు. అయితే `నర్తనశాల` ఫుటేజ్ ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో `అబు బాగ్దాద్ గజదొంగ` నుంచి ఏదైనా గుడ్ న్యూస్ వినిపిస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే చిరు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
A few days back, Megastar Chiranjeevi shocked everyone by uploading a photo where he is seen with a tonsured head. Many celebrities including Ram Charan, Satya Dev, Varun Tej, Nagababu and others were surprised with this look as they mentioned the same in the comments section.
Now, Chiranjeevi posted a behind the scenes video where he gave us a peek into what went behind this look and how much effort was put in to get the tonsured look. Chiranjeevi called it an ‘Urban Monk’ look and fans are loving it. He wrote, ‘Making of the #UrbanMonk. Thanks to all the technicians of the industry, who can make any look believable. Salute the magic of cinema!’
It is inspiring to see Megastar Chiranjeevi going the extra mile to entertain the audience even at this age. This proves his hard work and love for cinema. It is still unclear whether this tonsured look is for his upcoming film ‘Acharya’ directed by Koratala Siva or not. We need to wait for some more time to get more details about this look.
మెగాస్టార్ చిరంజీవి సడెన్ గా గుండుతో ప్రత్యక్షమై షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బాల్డ్ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు ఇది ఊహించనిది. ఇంతకుముందు రజనీకాంత్ `శివాజీ` మూవీ కోసం ఈ తరహా లో బాల్డ్ లుక్ లో ప్రయోగం చేశారు. కమల్ హాసన్ పలు చిత్రాల్లో ట్రై చేశారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా సంథింగ్ స్పెషల్ గా ట్రై చేస్తున్నారా? అంటూ మాట్లాడుకున్నారు.
చిరు ఎంతో ధైర్యంగా ఈ స్టెప్ తీసుకున్నందుకు అభినందించారు. కెరీర్ పరంగా ప్రయోగాలు కొత్తేమీ కాదు కానీ ఇలాంటిది మాత్రం కొత్తేనని అంతా అన్నారు. మెగాస్టార్ లుక్ మారిపోగానే `ఆచార్య` షూటింగ్ ఆగిపోయిందని ఏవో ఇబ్బందుల్లో పడిందని కథనాలు రావడం హీట్ పెంచింది. అయితే ఆ తర్వాత కొందరు విభిన్నమైన సందేహాలు కూడా వ్యక్తం చేసారు. ఇదేమైనా ఆచార్యలో ఒక పాత్రకు సంబంధించిన లుక్ అయ్యి ఉంటుందని అంచనా వేసారు.
నిజానికి ఇది జస్ట్ మేకప్ టెస్ట్. ఆ లుక్ ఎలా ఉంటుంది? అన్నది చెక్ చేశారట. అదే వీడియోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొణిదెల బృందం పోస్ట్ చేశారు. నిజానికి చిరంజీవి గుండు చేయించుకోలేదు. ఆయన ఒరిజినల్ జుత్తు అలానే ఉండగా.. పైన ప్రోస్థటిక్స్ మేకప్ వేశారు. కొత్తొక వింత.. పాతొక రోత! ప్రతిసారీ పాతగా ఎందుకు.. ఈసారికి కొత్తగా ట్రై చేయాలన్న చిరు ఆలోచన ఇప్పటికైనా అర్థమైందా? ఈ వీడియోతో ప్రతిదీ క్లారిటీ వచ్చేసిందిగా? మొత్తానికి సీక్రెట్ అలా ఓపెన్ అయిపోయింది ఈ వీడియోతో.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆచార్య త్వరలో పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది చిరంజీవి కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొన్నటి వరకు మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ను రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. కాని అంతకు ముందు మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక రీమేక్ ను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు చిరంజీవి ఫ్యాన్స్ ను గత కొన్ని రోజులుగా కలవర పెడుతున్నాయి.
మెహర్ రమేష్ అట్టర్ ఫ్లాప్ సినిమాలు వరుసగా తీశాడు. దాంతో పదేళ్లుగా అతడికి కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. దాంతో కథ చర్చలు మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఇతర దర్శకులకు సాయంగా ఉంటున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవిని ఒప్పించిన మెహర్ రమేష్ సినిమా చేయబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలను చాలా మంది నమ్మలేదు. ప్రస్తుం ఆయన ముందు ఎంతో మంది దర్శకులు ఉండగా మెహర్ రమేష్ నే ఎందుకు చిరు ఎంపిక చేసుకుంటాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
అనుమానాలను పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. నిన్న పవన్ పుట్టిన రోజుకు మెహర్ రమేష్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అందుకు రిప్లైగా పవన్ కళ్యాణ్ స్పందించాడు. థ్యాంక్యూ రమేష్. నీవు చేయబోతున్న చిరంజీవి గారి మూవీకి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఇన్ని రోజులు అనుమానంగా ఉన్న చిరంజీవి.. రమేష్ ల మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఇటీవల చిరంజీవి ‘ఆచార్య’ టైటిల్ ను పొరపాటున ఇలాగే ప్రకటించారు. ఇప్పుడు పవన్ కూడా చిరు.. మెహర్ రమేష్ ల మూవీ విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడు. ఇక చిరు.. మెహర్ రమేష్ ల అఫిషియల్ అనౌన్స్ మెంట్ తరువాయి.
చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను ఆయన చేస్తాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సందర్బాల్లో త్రివిక్రమ్ కూడా తాను చిరంజీవితో సినిమా తీయాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. కనుక వీరిద్దరి కాంబో మూవీ గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలో వీరిద్దరి కాంబో మూవీ గురించి కొన్ని రోజులు ప్రముఖంగా ప్రచారం జరిగింది.
కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య మూవీ తర్వాత లూసీఫర్ రీమేక్ ను చేసేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. కాని లూసీఫర్ స్ర్కిప్ట్ విషయంలో కాస్త తేడా కొట్టింది. దాంతో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆ లోపు ఆచార్య తర్వాత మరో సినిమాను చిరంజీవి చేస్తాడని అంటున్నారు. ఆ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి కోసం త్రివిక్రమ్ కథ రెడీ చేశాడు అనేది సినీ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త.
ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ను ముగించుకుని ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. వచ్చే ఏడాది చివరి వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలో కూడా అదే ప్రచారం జరుగుతోంది.
Wishes are pouring in from all the corners on Megastar today and many celebrities are sharing about their best moments with him. But here comes the most trending and endearing picture of the entire day.
Megastar Chiranjeevi is seen sitting on a chair in their lawn while Charan laid down on the grass with a dog beside him. Interestingly, both father and son are staring at their phones.
This casual picture is now going viral and fans are loving it as they get to see their stars chilling happily without the thought of looking good all the time in front of the cameras. Seeing them this casual shows that they are also normal people who like to enjoy the simple pleasures of life.
On the work front, Megastar is working on ‘Acharya’ with Koratala Siva while Charan his waiting for ‘RRR’ to start again.
Megastar Chiranjeevi will be celebrating his birthday on 22nd August and the first look of his film with Koratala Siva will be revealed. There is still a lot of the shooting left to complete and after this project, rumors suggest that Chiru will be remaking two films.
The first one would be the much-anticipated ‘Lucifer’ remake. While it was earlier said that Sujeeth will be directing the remake, it reportedly fell into the hands of trusted director VV Vinayak. This mass director who is in terrible form recently with flops like ‘Intelligent’ and ‘Akhil’ is given the opportunity to direct Chiru for the third time after ‘Tagore’ and ‘Khaidi No 150’. Vinayak is already working on the script with his team of writers and Chiru is personally looking after the progress as per sources.
On the other hand, there is a talk that Chiranjeevi will be remaking Ajith’s ‘Vedhalam’ under the direction of Meher Ramesh. This ‘Shakti’ director has a terrible track record and he did not hold the megaphone since ‘Shadow’ which came and tanked in 2013. Megastar has reportedly given him the chance of remaking ‘Vedalam’ as per sources. Let us wait and see if Chiru brings luck to these two flop directors or not.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కొరటాల శివ స్టైల్ లో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లోనూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో చిరుకి జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు రామ్ చరణ్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా ‘ఆచార్య’ సినిమాతో 14 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – సంగీత బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మణిశర్మ ‘ఆచార్య’ కోసం ఎలాంటి మ్యూజిక్ అందించబోతున్నారో అని మెగా ఫ్యాన్స్ మరియు మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చిరు – మణి కాంబోలో వచ్చిన సినిమాల రిజల్ట్ ఎలా సంగీతం పరంగా బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ‘బావగారు బాగున్నారా?’ ‘చూడాలని ఉంది’ ‘మృగరాజు’ ‘ఇద్దరు మిత్రులు’ ‘అన్నయ్య’ ‘అంజి’ ‘ఇంద్ర’ ‘ఠాగూర్’ ‘జై చిరంజీవా’ ‘స్టాలిన్’ వంటి చిత్రాలు వచ్చాయి. చిరు పుట్టినరోజు నాడు రాబోయే మోషన్ పోస్టర్ కి మణిశర్మ ఇచ్చిన బీజీఎమ్ ని బట్టి ‘ఆచార్య’కి ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడో ఓ అంచనాకి రావొచ్చని మెగా అభిమానులు భావిస్తున్నారు.