It looks like a war of words has erupted between popular film stars Prakash Raj and Mega Brother Nagababu. It all started when Prakash Raj stoked a controversy by calling Pawan Kalyan a “chameleon” against the backdrop of Jana Sena Party’s alliance with the BJP in upcoming GHMC polls.
Responding to this, Nagababu jumped into a verbal fight with the veteran actor and countered him saying Prakash Raj is a cultureless man. He said Prakash Raj’s useless politics were revealed by Subrahmanya Swamy’s debate and he was exposed mercilessly. Nagababu also backed Pawan Kalyan’s decision of supporting BJP by saying decisions in politics would change from time to time by keeping the wider prospects of the people in the mind.
Now, Prakash Raj has also responded to Nagababu’s counter. He took to his Twitter handle and posted, ” I can understand your love for your younger brother. You should understand the love I have for the country. I can speak Telugu but I can not speak your language.” Prakash Raj with his sophisticated response has pushed Nagababu into self-defence. It remains to be seen how the Mega Brother reacts to Prakash Raj’s statements.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ – మెగా బ్రదర్ నాగబాబు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని.. అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘2014లో మీరే బీజేపీ వాళ్లు ఇంద్రుడు చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు వాళ్లు ద్రోహులు అన్నారు. మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు. అంటే ఇలా మూడు నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా’ అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. అయితే పవన్ ని ఏదైనా అంటే ఒంటి కాలిపై లేచొచ్చే సోదరుడు నాగబాబు ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
‘పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. పవన్ కళ్యాణ్ ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే అర్థం అయ్యింది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో.. డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. ఆ తర్వాత మాట్లాడు. డైరెక్టర్స్ ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంత కంటే మంచిగా మాట్లాడడం ఏమి తెలుసు. మీడియా అడిగింది కదాని ఒళ్లు పొంగి నీ పనికి మాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు” అని నాగబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. నాగబాబు ట్వీట్ పై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అయితే ప్రకాష్ రాజ్.. నాగబాబు లా కాకుండా తనదైన కౌంటర్ ఇచ్చారు. నాకు తెలుగు వచ్చు.. కానీ మీ భాష రాదంటూ నాగబాబు అభ్యంతరకర వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ”గౌరవనీయులైన నాగబాబు గారికి.. మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది. నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు. కానీ మీ భాష రాదు” అంటూ ప్రకాష్ రాజ్ తెలుగులో ట్వీట్ చేశారు. దీనికి #Justasking అనే హ్యాష్ ట్యాగ్ తో నాగబాబు ని ట్యాగ్ చేసిన ప్రకాష్.. దండాలు పెడుతున్న ఎమోజీలు ఉంచాడు. మరి దీనిపై మెగా బ్రదర్ స్పదిస్తారా లేదా సైలెంటుగా ఉంటారా అనేది చూడాలి.
నాకు ఫోన్ కాల్ దూరంలో కథానాయికలు ఉన్నారు.. నన్ను నమ్మితే ఆఫర్లే ఆఫర్లు! అంటూ గదిలో గడుసుగా ప్రవర్తించాడు! అంటూ అందాల కథానాయిక పాయల్ ఘోష్ #MeToo వేదికగా అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్ డైరెక్టర్ పై ఆరోపించడం సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యల పై అనురాగ్ స్పందించారు.
పాయల్ ఘోష్ #MeToo ఆరోపణ పై స్పందిస్తూ.. కంగనా రనౌత్ తన ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తోందని పరోక్షంగా ఆరోపించారు అనురాగ్. పాయల్ ఘోష్ ఒక ఇంటర్వ్యూలో దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కానీ ఆయన కంగనా పేరు పెట్టకపోయినా అతను బచ్చన్ కుటుంబాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు పాయల్ కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. జయ బచ్చన్-కంగనా రనౌత్ ల పేర్లను ఈ గొడవలోకి లాగారాయన. ఒక మహిళ (కంగనా కావచ్చు) ఇతర మహిళలు (ఘోష్) తన పై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ఈ గొడవలోకి లాగారని ఆరోపించడం ద్వారా అనురాగ్ తెలివిగా తన ట్వీట్లను ప్రారంభించాడు.
పాయల్ ఘోష్ ఆరోపించిన వెంటనే కశ్యప్ ఆత్మ రక్షణ కోసం ట్విట్టర్ లో కౌంటర్లు స్టార్ట్ చేశారు. హిందీలో వ్యాఖ్యానిస్తూ.. “వావ్ మీరు నన్ను చాలా కాలం నుండి సైలెంట్ చేయడానికి ప్రయత్నించారు. సమస్య లేదు. నన్ను నిశ్శబ్దంగా ఉంచేందు కోసం.. మీరు చాలా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఇతరులు కూడా ఈ అబద్ధంలో చిక్కుకున్నారు. మేడమ్ నేను చెప్పదలచుకున్నది నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి“ అంటూ అనురాగ్ `ఆధారం` అన్న పాయింట్ ను వాడారు.
నాపై ఆరోపిస్తూ నా నటులను (తాప్సీ పన్నూ) బచ్చన్ కుటుంబాన్ని లాగడం తదుపరి స్థాయి మేడమ్.. నేను రెండుసార్లు వివాహం చేసుకున్నాను. అది నేరం అయితే.. నేను వారిని చాలా ప్రేమిస్తున్నానని అంగీకరిస్తాను. నా మొదటి లేదా రెండవ భార్య .. ప్రేమికులను కలిసినా ఒక నిందితుడిలా ప్రవర్తించను! ఇంకా ఏమి జరుగుతుందో చూద్దాం“ అంటూ అనురాగ్ ఎమోషన్ అయ్యారు.
ఇటీవల కంగన యోధురాలిని అన్న వ్యాఖ్యపై అనురాగ్ కౌంటర్ తెలిసినదే. నలుగురు గ్యాంగ్ ని తీసుకెళ్లి చైనాతో యుద్ధం చేయమని అనురాగ్ కంగనాను కోరారు. ఆ తర్వాత ఒలింపిక్స్ లో చేరమని కంగన కౌంటర్ వేసింది. అతను ఎప్పుడూ తెలివితక్కువవాడని అంది. ఈ గొడవ తర్వాత పాయల్ ఘోష్ వేధింపుల ఆరోపణలు సంచలనం అయ్యాయి.