మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో అమెరికాలో ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ఇక్కడ భారీ బిజినెస్ జరగడం చాలా కామన్. కాని ఈ సినిమా తమిళనాడులో డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండా విజయ్ టీవీ తమిళ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.
ఇప్పటి వరకు మహేష్ బాబు నటించిన సినిమాలు తమిళంలో చాలా వరకు డబ్బ్ అయ్యి శాటిలైట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వెళ్లాయి. ఇప్పటి వరకు ఏ సినిమా దక్కించుకోని శాటిలైట్ రేటును ఈ సినిమా దక్కించుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించడం వల్ల విజయ్ టీవీ చాలా రేటు పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. తమిళనాట స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ వల్ల అక్కడ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తానికి సర్కారు వారి పాట అమ్ముడు పోయే అవకాశం ఉంది అంటూ చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ టాలీవుడ్ కి చాలా పాఠాల్ని నేర్పించింది. ఈ నాలుగైదు నెలల్లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. థియేటర్లు తెరవకపోతే ఆల్టర్నేట్ గా ఓటీటీ ఏటీటీ విజృంభించాయి. వీటిలో సినిమాలు వీక్షించేందుకు యూత్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక థియేటర్లు తెరిచే వరకూ ఈ పరిస్థితి ఇలానే కొనసాగనుంది.
అంతేకాదు ఇప్పట్లో షూటింగులకు అవకాశం లేదు కాబట్టి వేరొక కొత్త విధానంలో ఆర్జన ఎలా? అన్నది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అలా పాత హిట్టు సినిమాల్ని డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాల్ని ఇతర భాషల్లోకి అనువదించి ఆన్ లైన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే పొరుగు భాషా చిత్రాల్ని ఓటీటీలు అనువదించి తమ వేదికపై అందిస్తున్నాయి.
అదే కోవలో తెలుగు మూవీ `అరవింద సమేత` ఇరుగు పొరుగు భాషల్లోకి అనువాదమవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా `అరవింద సమేత`. పూజా హెగ్డే కథానాయికగా నటించింది. తారక్ కెరీర్లో అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. తారక్ సిక్స్-ప్యాక్ మేకోవర్ .. భారీ యాక్షన్ ఎపిసోడ్లకు అభిమానులు సినీ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ చిత్రం త్వరలో హిందీ మరియు కన్నడ భాషలలో డబ్ కానుంది. ఇప్పటికే డబ్బింగ్ ఫార్మాలిటీస్ మొదలెట్టారని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.