గంజాయి చట్టవిరుద్ధం అయితే ఆన్ లైన్ లో ఎలా అమ్ముతారు?

భారతదేశంలో చట్టవిరుద్ధం అయితే గంజాయి నూనె లేదా సిబిడి ఆయిల్ ఆన్ లైన్ లో కొనేందుకు అంత సౌకర్యంగా ఎలా అందుబాటులో ఉంటోంది? అనే ప్రశ్నను బాలీవుడ్ కథానాయిక మీరా చోప్రా లేవనెత్తింది. బుధవారం సాయంత్రం మీరా సిబిడి చమురును నెట్ నుండి కొనుగోలు చేయవచ్చని షాపింగ్ వెబ్ సైట్ లో దాని లభ్యతను తనిఖీ చేశానని ట్వీట్ చేసింది.

“ఇప్పుడే అడుగుతున్నాను. సిబిడి ఆయిల్ చట్టవిరుద్ధం అయితే ఆన్ లైన్ లో ఎలా అంత సౌకర్యంగా లభిస్తుంది. అమెజాన్ లో కూడా దాని లభ్యతను నేను తనిఖీ చేసాను. చట్టవిరుద్ధం అయితే ఎందుకు నియంత్రణ లేదు? # సిబిడాయిల్“ అని మీరా తన అధికారిక ఖాతా నుండి ట్వీట్ చేసింది.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మాదకద్రవ్యాల కోణాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) పరిశీలిస్తున్న తరుణంలో మీరా ప్రశ్న సంచలనమైంది. కొంతమంది ఎ-లిస్ట్ బాలీవుడ్ నటీమణులను ప్రశ్నించడానికి ఎన్.సి.బి పిలిపించిన సంగతి విధితమే.

వేరొకరి ట్వీట్ కు ప్రతిస్పందనగా మీరా ఇలాంటి లాజికల్ ట్వీట్ చేయడం కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహా ఎన్.సిబి ముందు `అంగీకరించినట్లు` ఆమె శ్రద్ధా కపూర్ కోసం గంజాయి నూనెను ఏర్పాటు చేసిందని మరియు ఆన్ లైన్ లో కొనుగోలు చేసిందని ఓ గుసగుసా వినిపించినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ఇదిలా వుండగా మాదకద్రవ్యాల కేసులో ప్రశ్నించినందుకు బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకొనే- సారా అలీ ఖాన్- శ్రద్ధా కపూర్- రకుల్ ప్రీత్ సింగ్ లను పిలిచినట్లు ఎన్.సిబి బుధవారం తెలిపింది. ఆ మేరకు జాతీయ మీడియా కథనాలు సంచలనాలు అయ్యాయి.

Related Images:

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్ లైన్ తరగతులు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పాఠశాలలు తెరుచుకోలేదు. రెండు మూడు నెలలు వేచి చూద్దామని అనుకున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. వేసవి సెలవులకు ముందు సుమారు రెండు నెలలు ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే నాలుగు నెలలు వృథా అవడంతో పిల్లల చదువు పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ పాఠశాలలు అయితే జూన్ నుంచే ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆ తరగతులను ప్రభుత్వం నిలిపివేసింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు ఆన్లైన్ పాఠాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కూడా విద్యా సంవత్సరం వృథా కాకుండా పిల్లలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపడంతో అందుకు ప్రభుత్వం కూడా అనుమతించింది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి డిజిటల్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.

టీశాట్ దూరదర్శన్ ద్వారా పాఠాలను బోధించనున్నారు. ఇక త్వరలోనే ఆన్ లైన్ తరగతులు ప్రారంభమవనుండడంతో ఆగస్టు 27 నుంచి పాఠశాలకు హాజరు కావాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వచ్చే నెల 5వ తేదీన పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే కరోనా కేసులు సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడంతో పాఠశాలలను ప్రారంభిస్తా రా..లేదా అనేది సందేహాస్పదంగా మారింది.

Related Images:

ఆన్ లైన్ టిక్కెటింగ్ తో దొంగ లెక్కలకు చెక్

ఆన్ లైన్ టికెటింగ్ కావాలంటూ గగ్గోలు పెట్టేది ఎందుకు? థియేటర్ ఆక్యుపెన్సీ ఎంత? కలెక్షన్లు వాస్తవికంగా ఎలా ఉన్నాయి? ఏ హీరోకి ఓపెనింగుల రేంజు ఎంత? లాంగ్ డ్రైవ్ లో వసూళ్ల సత్తా ఎంత? అన్నది క్లారిటీగా తెలుసుకునేందుకే ఇదంతా. కానీ ఈ విధానానికి తూట్లు పొడుస్తూ తప్పుడు లెక్కలు చెబుతూ మా హీరో ఇంత అంటే మా హీరో అంత అంటూ ప్రగల్బాలు పలికేవాళ్లే ఎక్కువయ్యారు. ఏదీ ఇక్కడ పారదర్శకంగా ఉండదు. తొలి వారం లెక్కలు సహా వీకెండ్ కలెక్షన్స్.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అంటూ చేసే ఏ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేరు.

అయితే అన్నిటికీ చెక్ పెట్టేయాలంటే ఆన్ లైన్ టికెటింగ్ అవసరం. టికెటింగ్ విండో వద్ద తెగే ప్రతి టిక్కెట్టుకి లెక్క తేల్తుంది పక్కాగా. ఇక థియేటర్ క్యూలైన్ లో నుంచోవాల్సిన దుస్థితి కూడా ఉండదు. అయితే వీటన్నిటికీ కరోనా మహమ్మారీ ఒక సొల్యూషన్ ని జనం ముందుకు తేనుందని భావిస్తున్నారు. ఇప్పటికే మహమ్మారీ వల్ల లాక్ డౌన్ లు ముగిసి అన్ లాక్ 4.0 వరకూ వచ్చాం. ఇక పైనా థియేటర్లను మాల్స్ ని మూసి ఉంచితే ఈ రంగంలో పని చేస్తున్న వారికి బతుకులే కష్టం. అందుకే ఇకపై థియేటర్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయనుంది కేంద్రం.

గత మూడు వారాలుగా సెప్టెంబర్ నుండి సినిమా హాళ్ళు తెరుచుకుంటాయనే చర్చకు తగ్గట్టే ఇంకో పది రోజుల్లోనే థియేటర్లు తెరుచుకునే వీలుందని తెలుస్తోంది. జనం కరోనా భయం నుంచి తేరుకుని నెమ్మదిగా థియేటర్ల బాట పడతారని ఆశిస్తున్నారు. ప్రారంభంలో ఆక్యుపెన్సీ 25-30 శాతమే ఉండొచ్చు. క్రమంగా పెరిగే వీలుంటుంది.

అయితే థియేటర్లలో భౌతిక టికెటింగ్ ఉండదు. కౌంటర్ టిక్కెట్ల కోసం క్యూలలో నిలబడి ఉండాల్సిన పనే లేదు. సింగిల్ స్క్రీన్లు లేదా మల్టీప్లెక్స్లు అయినా ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి అవుతుంది. దీనర్థం తెగే ప్రతి టిక్కెట్టుకి లెక్క తేలుతుందనే. అందుకే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. ఇక పలు ఏజెన్సీలు ఈ విధానంలో పారదర్శకతను తెచ్చేందుకు ఆన్ లైన్ రూపకల్పన చేస్తుండడం ఆసక్తికరం. ఇది టికెటింగ్ లో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా భావించవచ్చు. ఒక రకంగా ఇది బాక్సాఫీస్ లెక్కలు చెప్పేవారికి.. సినీ ప్రియులకు ఇది గొప్ప విషయమేనని చెప్పాలి. ఇండస్ట్రీ రికార్డులు .. 200 కోట్ల క్లబ్ అంటూ పోస్టర్లు ఇక కనిపించి.. వినిపించే వీల్లేదేమో!

Related Images: