కరణ్ బండారం బయట పెట్టిన జాతీయ అవార్డు గ్రహీత

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ను ఎంత మంది గొప్ప వ్యక్తి అంటూ పిలుస్తారో అంతకు మించిన వారు అతడి తీరును తప్పుబడుతూ ఉంటారు. ప్రతిభను తోచుకోవడం.. కష్టాన్ని వాడుకోవడం వంటివ చేస్తాడంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ దర్శకుడు మాధుర్ బండార్కర్ మాట్లాడుతూ కరణ్ జోహార్ పై తీవ్ర విమర్శలు చేశాడు.

తాను రిజిస్ట్రర్ చేయించిన బాలీవుడ్ వైవ్స్ ను కాపీ కొట్టి తాను వెబ్ సిరీస్ చేస్తున్నాడు అంటూ ఆరోపించాడు. మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో బాలీవుడ్ వైవ్స్ సినిమా రూపొందుతుంది. అందుకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే మొదలు పెట్టినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఆ సినిమా టైటిల్ ను కరణ్ జోహార్ తన వెబ్ సిరీస్ కు వాడుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

బాలీవుడ్ వైవ్స్ టైటిల్ ను తనకు ఇవ్వాలంటూ కరణ్ జోహార్ అడిగారు. కాని నేను రిజిస్ట్రర్ చేయించి సినిమాను కూడా మొదలు పెట్టిన కారణంగా ఇవ్వను అంటూ చెప్పాను. తాను ఆ టైటిల్ ఇవ్వక పోవడంతో తన వెబ్ సిరీస్ కు ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ టైటిల్ ను పెట్టాడు. నెట్ ప్లిక్స్ కోసం అతడు నిర్మిస్తున్న వెబ్ సిరీస్ కోసం తన టైటిల్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకుని పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నాడు. బాలీవుడ్ వైవ్స్ రిజిస్ట్రర్ చేయించాను.

మేము రిజిస్ట్రర్ చేసిన టైటిల్ ను ఆయన వాడుకోవడం అనైతికం అంటూ మాధుర్ బండార్కర్ అన్నారు. దర్శకుడిగా పలు సూపర్ హిట్ లు అందుకున్న దర్శకుడు ఇప్పుడు ఆశించిన స్తాయిలో సక్సెస్ లను అందుకోలేక పోతున్నాడు. బాలీవుడ్ వైవ్స్ తో అయినా సక్సెస్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో టైటిల్ గోల్ మాల్ అవ్వడంతో ఏం చేయాలో పాలుపోక నానా ఇబ్బందులు పడుతున్నట్లుగా అనిపిస్తుంది.

Related Images:

కరణ్ జోహార్ ను ఇరికిస్తే నన్ను వదిలేస్తామని NCB అధికారులు చెప్పారు!- క్షితిజ్ ప్రసాద్

సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ దర్యాప్తులో ప్రశ్నించిన తరువాత క్షతిజ్ ప్రసాద్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శనివారం అరెస్టు చేసింది. ఈ సన్నివేశంలో ఆయన చేసిన ఆరోపణ హాట్ టాపిక్ అయ్యింది. ధర్మాటిక్ ఎంటర్ టైన్మెంట్ (ధర్మ ప్రొడక్షన్స్ కి చెందిన డిజిటల్ విభాగం) ఉద్యోగి క్షితిజ్ ప్రసాద్ మాట్లాడుతూ.. “దర్శకనిర్మాత కరణ్ పేరును తప్పుగా ఇరికించవలసి వచ్చింది“ అని ఆరోపించినట్టు ప్రముఖ జాతీయ చానెల్ కథనం వేయడం విశేషం.

“నేను కరణ్ జోహార్.. సోమెల్ మిశ్రా.. రాఖీ.. అపూర్వా (మెహతా).. నీరజ్ లేదా రాహిల్ లను ఇరికించినట్లయితే వారు నన్ను విడిచిపెడతారని ఎన్సీబి అధికారులు చెప్పారు“ అని ప్రసాద్ న్యాయవాది సతీష్ మనేషిందే ఆదివారం ముంబై కోర్టుకు తెలిపారని సదరు చానెల్ కథనం వెల్లడించింది.

“దర్యాప్తు అధికారులు ఒత్తిడి చేశారు. వారు మాదకద్రవ్యాలను సేవించారని నన్ను తప్పుగా ఆరోపించమని అడిగారని ఆయన అన్నారు. ఈ వ్యక్తులలో ఎవరూ వ్యక్తిగతంగా నాకు తెలియదు కాబట్టి నాపై ఒత్తిడి వచ్చినా అందుకు ససేమిరా అన్నాను. నేను ఎవరినీ తప్పుగా ఇరికించాలని అనుకోలేదు“ అని ప్రసాద్ పేర్కొన్నారు.

ప్రసాద్ ను ధర్మాటిక్ డిజిటల్ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్ సిబి బృందం శుక్రవారం సబర్బన్ వెర్సోవాలోని తన నివాసం నుంచి తీసుకెళ్లింది. అతడిని బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయంలో ప్రశ్నించారు. “శనివారం ప్రసాద్ ని అరెస్టు చేసిన తరువాత ఆసుపత్రిలో కోవిడ్-19 కోసం అలానే ఇతర వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు“ అని ఒక అధికారి మీడియాకి చెప్పారు. ఆ తర్వాత ఎన్.సిబి విస్తృత దర్యాప్తులో ప్రసాద్ పేరు మార్మోగింది. హిందీ చిత్ర పరిశ్రమలో డ్రగ్-నెక్సస్ కు సంబంధించిన కేసులో ఒకప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ తో అనుబంధంగా ఉన్న అనుభవ్ చోప్రాను కూడా ఎన్.సిబి శుక్రవారం ప్రశ్నించింది.

శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దర్శకనిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ప్రసాద్ తో తన సంబంధాల గురించి వివరించారు. “ధర్మ ప్రొడక్షన్స్ సోదర సంస్థ అయిన ధర్మాటిక్ ఎంటర్ టైన్మెంట్లో ఒక ప్రాజెక్ట్ కోసం 2019 నవంబర్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ నిర్మాతలలో ఒకరిగా చోప్రా చేరారు. చివరికి అది కార్యరూపం దాల్చలేదు. చోప్రా అసిస్టెంట్ డైరెక్టర్ గా తన బ్యానర్ తో కొంతకాలం సంబంధం కలిగి ఉన్నాడని రెండు ప్రాజెక్టులలో మాత్రమే పనిచేశాడు“ అని కరణ్ జోహార్ తెలిపారు. అతడు నవంబర్ 2011 .. జనవరి 2012 మధ్య.. అలాగే 2013 జనవరిలో ఓ లఘు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక చిత్రానికి 2వ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో కేవలం రెండు నెలలు మాత్రమే మాతో సంబంధం కలిగి ఉన్నాడు. ఆ తరువాత అతను ఎప్పుడూ ధర్మ ప్రొడక్షన్స్ తో సంబంధం కలిగి లేడు“ అని కరణ్ వెల్లడించారు.

Related Images:

సుశాంత్ ఇష్యూను ఇంకా వాడుకునే ప్రయత్నం చేస్తోంది

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణించిన వెంటనే ఆయన అభిమానులు చాలా మంది రియా కారణంగా మృతి చెందాడు అంటూ ఆరోపించడం మొదలు పెట్టారు. కొందరు మాత్రం బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కంగనా ఎంట్రీ ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుశాంత్ మరణంకు బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం బ్యాచ్ అని వారు ఒక మాఫియాగా ఏర్పడి ప్రతిభ ఉన్న వారిని తొక్కేస్తూ తమ వారికి ఆఫర్లు ఇచ్చుకుంటుందని విమర్శలు చేయడం ప్రారంభించింది.

సుశాంత్ కేసులో మొదట్లో ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు సీరియస్ గా పరిగణించే వారు. ఆమె చెబుతున్న దాంట్లో నిజం ఉందేమో అనుకున్నారు. కాని ఆ తర్వాత సుశాంత్ కేసు పేరుతో తనకు కక్ష ఉన్న కరణ్ జోహార్.. మహేష్ భట్ వంటి ప్రముఖుల పేర్లను పదే పదే ఈ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించడంతో సుశాంత్ మృతిని తన వ్యక్తిగత అజెండాకు ఉపయోగించుకుంటుందని కొందరు అనుమానించడం మొదలు పెట్టారు. ఇప్పటికే సుశాంత్ కుటుంబం తరపు వాదిస్తున్న లాయర్ ఈ విషయంలో కంగనా మరీ ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తుందని.. తన వ్యక్తిగత అజెండాను ఈ విషయంలో జొప్పించే ప్రయత్నం చేస్తుందంటూ చురకలంటించాడు. దాంతో కాస్త సైలెంట్ అయినట్లుగా అనిపించిన కంగనా మళ్లీ నేడు ట్విట్టర్ లో రెచ్చి పోయింది.

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు అతడు హత్య చేసి యద్దేచ్చగా తిరుగుతున్నాడు అంటూ ఏకంగా ప్రధాని మోడీని ట్యాగ్ చేసి ట్వీట్ చేసింది. ఇక తనను ట్రోల్ చేసిన వారి ట్వీట్ ను ముంబయి పోలీస్ కమీషనర్ లైక్ చేయడం అత్యంత దారుణం అంటూ కంగనా ఆరోపించింది. అయితే ఆ విషయాన్ని పోలీసులు కొట్టిపారేశారు. అందుకు సంబంధించిన సైబర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అన్నారు. ఇక డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించింది.

Related Images: