తంబీల మత్తులో టాలీవుడ్ ని లైట్ తీస్కుందా?

టాలీవుడ్ లో ఆరేళ్లుగా కెరీర్ సాగిస్తోంది దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. అగ్ర హీరోల సరసన అవకాశాలు రాకపోయినా మిడ్ రేంజ్ హీరోలు యంగ్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. అయితే ఇటీవల టాలీవుడ్ కెరీర్ సోసోగానే మారింది. వెంకీ మామ- వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత మరో క్రేజీ చిత్రానికి రాశీ సంతకం చేసింది లేదు.

ఆ క్రమంలోనే తమిళ పరిశ్రమలో మాత్రం రాశీ జోరు పెంచింది. అక్కడ ఒక్కొక్కటిగా క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికిప్పుడు తమిళంలో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు.

నేడు రాశీ పుట్టినరోజు సందర్భంగా తన క్రేజీ మూవీ వివరాలు వెల్లడయ్యాయి. రాశీ తాజాగా ఓ భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ కి సంతకం చేసింది. ఇందులో చియాన్ విక్రమ్ సరసన రాశీ నాయికగా నటిస్తుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించనున్నారు. సామి- సామి స్క్వేర్ తర్వాత ఈ కాంబోలో క్రేజీ మూవీ ఇది. రాశీ నటిస్తున్న తమిళ చిత్రాల్లో ఆరణ్మనై 3- తుగ్లక్ దర్బార్-మేధావి చిత్రీకరణలో ఉన్నాయి. సైతాన్ కా బచ్చా రిలీజ్ కి రావాల్సి ఉంది.

Related Images:

జవానీకి మత్తు దించేసే డేట్ వచ్చేసింది!

2019 కియరా నామ సంవత్సరంగా డిక్లేర్ అయ్యింది. వరుస హిట్లతో అమ్మడు మోతెక్కించేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ .. అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూజ్ చిత్రాలలో నటించి బంపర్ హిట్లు అందుకుంది. ఆ రెండు విజయాలతో అందరి కళ్ళకు ఆపిల్ లా కనిపించింది. ఆ తర్వాతనే మహమ్మారీ ఈ అమ్మడికి ఊపిరాడనివ్వలేదు. 2020 ఇంకా పెద్ద టార్గెట్లతో దూసుకుపోవాలని ప్లాన్ చేసింది కానీ అది సాధ్యం కావడం లేదు.

ఎట్టకేలకు కియారా నటించిన తాజా చిత్రం `ఇందూ కి జవానీ` ఓటీటీలో రిలీజవుతోంది. ఈ మూవీ అభిమానులకు ప్రత్యేకించి ఆశ్చర్యం కలిగించే రేంజులో ఉంటుందని ప్రచారం సాగిపోతోంది. తాజాగా కియరా ఓ చమత్కారమైన వీడియోను అభిమానులకు షేర్ చేసింది. ఇందులో ఆమె ఇందూ గుప్తాగా కనిపించింది. ఇది ఇందూ కి జవానీలో తన పాత్ర. ఇందూ కోసం ఉత్సాహంగా ఎలా చూస్తున్నారా.. డేటింగ్ తేదీ ఫిక్స్ చేసేద్దామా అంటూ కియరా ట్విస్టిచ్చింది. స్క్రీన్ పైనే 16 సెప్టెంబర్ ఇది తేదీ అంటూ న్యూస్ చదివేసింది. కియారా వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. “మెయిన్ తోహ్ టైమ్ సే ఆ జాంగి డేట్ కే లియే ఆప్ లేట్ మాట్ హోనా! ఇందూను కలవడానికి ఇంకొంచెం వేచి ఉండండి! #IndooKiJawani. ” అని కోట్ చేసింది. గజియాబాద్ కు చెందిన ఇందూ అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నందున కియారా ఇదిగో ఇలా ప్రత్యేకంగా చమత్కారమైన అవతారంలో కనిపించింది. తన ప్రవర్తన డిక్షన్ పై కియరా చాలానే వర్కవుట్ చేసినట్లు తెలుస్తోంది.

అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు. `ఇందూ కి జవానీ` డేటింగ్ నేపథ్యంలో సినిమా. ప్రేమలో రకరకాల సాహసాల చుట్టూ తిరిగే ఏజ్డ్ లవ్ స్టోరితో కామెడీ ఆకట్టుకుంటుందట. కియారాతో పాటు ఆదిత్య సీల్ ప్రధాన పాత్రలో నటించింది.

Related Images:

మాళవిక లా చిత్తు చేయడం కొందరికే తెలిసిన విద్య!

మత్తు కళ్లతో చిత్తు చేయడం కొందరికే తెలిసిన విద్య. ఇటీవలి కాలంలో ఊహాతీతంగా తారా లోకంలోకి దూసుకొచ్చిన మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇందులో ఎక్స్ పర్ట్. ఇక ఈ అమ్మడు ర్యాంప్ షోస్ వీక్షించిన వారికి ప్రత్యేకించి మత్తు కళ్ల వ్యవహారం గురించి పరిచయం చేయనక్కర్లేదు.

ఆ విషయంలో షో స్టాపర్ ఈ అమ్మడు. గత కొంతకాలంగా ఇన్ స్టాలో మాళవిక మోహనన్ షేర్ చేసిన ఫోటోషూట్లు చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమైపోతుంది. మొన్నటికి మొన్న ఓనం పండగరోజు రెడ్ హాట్ శారీలో దర్శనమిచ్చిన మాళవిక.. ఆ తర్వాత హీట్ పెంచే ఫోటోషూట్ తో అభిమానులను స్టన్నయ్యేలా చేసింది. ప్రఖ్యాత జేఎఫ్.డబ్ల్యూ కవర్ పేజీపై తళుకుబెళుకులతో హుషారెత్తించింది.

తాజాగా మాళవిక స్టన్నింగ్ ఫోటో ఒకటి అంతర్జాలాన్ని సునామీలా చుట్టేస్తోంది. ఇక ఇందులో గాగుల్స్ పెట్టుకున్న ఈ భామ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. స్టన్నింగ్ పొట్టి ఫ్రాకులో మతి చెదిరే ట్రీటిచ్చింది. ఇక కెరీర్ పరంగా చూస్తే ఈ అమ్మడు ప్రస్తుతం విజయ్ సరసన మాస్టర్ లో నటించింది. తదుపరి టాలీవుడ్ లో బిగ్ అప్ డేట్ ఉంటుందని సమాచారం.

Related Images: