లాక్ డౌన్ తర్వాత అతి పెద్ద ‘ఆహా’ అనిపించే వేడుక

అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ మెల్ల మెల్లగా కంటెంట్ విషయంలో స్పీడ్ పెంచింది. మొదట్లో ఆహాలో కంటెంట్ అస్సలు ఉండటం లేదు అనే ఫిర్యాదు ఉండేది. కాని ఇప్పుడు సినిమాలు.. వెబ్ సిరీస్ లు.. టాక్ షోలు డబ్బింగ్ సినిమాలు ఇలా ఆహా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. ముందు ముందు మరింతగా కూడా ఆహా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అయ్యింది. ఆ విషయాన్ని ఈనెల 13వ తారీకున ఒక భారీ వేడుకను ఏర్పాటు చేసి ప్రకటించబోతున్నారు. ఆ విషయమై ఆహా అధికారికంగా ప్రకటించింది.

అల్లు అర్జున్ ప్రధాన గెస్ట్ గా ఆహా భారీ వేడుక జరుగబోతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి నుండి ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా భారీ సినిమా వేడుక జరగలేదు. కనీసం ప్రెస్ మీట్ లు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. కరోనా భయం మెల్ల మెల్లగా తగ్గుతున్న ఈ సమయంలో సినీ వేడుకలకు కూడా ప్రభుత్వం నుండి అనుమతులు వస్తున్నాయి. ఆహాలో రాబోయే సంవత్సర కాలం పాటు స్ట్రీమింగ్ అవ్వబోతున్న కార్యక్రమాలు సినిమాలు మరియు ఇతర కార్యక్రమాలను అల్లు అర్జున్ తో అనౌన్స్ చేయించబోతున్నారు.

ఇదే సమయంలో ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను ప్రకటించే అవకాశం కూడా ఉందని మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఆహా కోసం పబ్లిసిటీ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈనెల 13న భారీ ఎత్తున మెగా అభిమానులు ఈ కార్యక్రమంకు హాజరు అయ్యేలా ఇప్పటికే పాస్ లను కూడా జారీ చేశారట. ఆహా వేడుకతో మళ్లీ టాలీవుడ్ సినీ వేడుకలు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

The grand event #AAPresentsAHA on NOVEMBER 13 from 5 PM onwards

Related Images:

లాక్ డౌన్ లో రివెంజ్ పోర్న్ ఎక్కువైందట!

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి సృష్టించిన విలయానికి పలువురు ఉద్యోగాలు కోల్పోగా చాలామంది ఉపాధికి దూరమయ్యారు. వేలసంఖ్యలో కంపెనీలు మూతపడే పరిస్థితి నెలకొన్నది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరుద్యోగులయ్యారు. అయితే కరోనాతో అన్నిదేశాలు కొంతకాలంపాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే ఈ లాక్డౌన్తో రివెంజ్ పోర్న్ పెరిగిందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

రివెంజ్ పోర్న్ అంటే ఏమిటి..

సామాజిక మాధ్యమాల్లో తమ భాగస్వాముల వ్యక్తిగత ఫొటోలను అంటే.. వాళ్లతో సన్నిహితంగా గడిపిన ఫొటోలను షేర్ చేయడమే రివెంజ్ పోర్న్. కొందరు తాము ప్రేమించిన వారితో సన్నిహితంగా ఉంటారు. ఆ సమయంలో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకోవడం కామనే. అయితే బ్రేకప్ చెప్పినప్పుడు – లేదా భార్యాభర్తలు విడిపోయినప్పుడు అటువంటి ఫొటోలను తొలగించడం సంస్కారం.

అయితే కొందరు సంస్కార హీనులు ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తమ మాజీ సహచరులపై కక్ష సాధిస్తుంటారు ఇదే రివేంజ్ పోర్న్.. ప్రస్తుతం ఈ తరహా రివెంజ్ పోర్న్ మనదేశంలోనూ చూస్తున్నాం. బ్రిటన్ లో ఈ తరహా నేరాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయట. ఆదేశంలో ఇటువంటి ఘటనలపై ఈ లాక్డౌన్ పీరియడ్ లోనే 2050 ఫిర్యాదులు వచ్చాయట. గత ఏడాదితో పోల్చితే ఇది 22 శాతం ఎక్కువని అధికారులు చెబుతున్నారు. అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలను పంచుకోవడం ఇంగ్లాండ్ – స్కాట్లాండ్ మరియు వేల్స్ లో చట్టవిరుద్ధం. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల రావడంతో సైబర్క్రైం పోలీసులు ఇంటర్నెట్ నుంచి 22515 ఫొటోలను డిలిట్ చేశారు.

Related Images:

లాక్ డౌన్ లో లుక్ మార్చేసిన టాలీవుడ్ హీరోలు…!

సినిమాల్లో కథానాయకులు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తేనే సినీ ప్రేక్షకులు కూడా అదే తరహాలో ఆదరిస్తూ ఉంటారు. అందుకే హీరోలు సినిమాతో పాటు తమ లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తమ సినిమాలో ప్రేక్షకులకు కనువిందుగా కనిపించడానికి శక్తిమేర కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు హీరోలు లుక్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంటారు. ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే హీరోలు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు. దీంతో చాలామంది హీరోల బాడీ షేప్ లో మార్పులు కనిపించాయి. సినిమాలు లేవు కదా అని అనుకున్నారేమో కొంచం బొద్దుగా తయారయ్యారు. అయితే మరికొందరు హీరోలు మాత్రం లాక్ డౌన్ లో కావాల్సినంత సమయం దొరికిందంటూ తమ బాడీ షేప్ ని హెయిర్ స్టైల్ ని.. లుక్ ని మార్చేసి అదరగొడుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఆరు చిత్రాల నుండి లుక్ పరంగా పెద్దగా వేరియేషన్ చూపించలేదేనే చెప్పాలి. అందుకని త్వరలో స్టార్ట్ కాబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం లుక్ ని మార్చేశారు మహేష్. ఇటీవల ఓ యాడ్ షూట్ కోసం బయటకు వచ్చిన మహేష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పొడవాటి జుట్టుతో లైట్ గా గడ్డం పెంచి కనిపిస్తున్న మహేష్ లుక్ అభిమానులకు కిక్ ఇచ్చింది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన లుక్ లో లైట్ గా వేరియేషన్ చూపించాడు. ఇటీవల హరితహారంలో భాగంగా బయటకు వచ్చిన ప్రభాస్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. అక్కినేని అఖిల్ లాక్ డౌన్ లో కఠోర వర్కౌట్స్ చేసి తన బాడీని బిల్డ్ చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలో స్టార్ట్ కాబోతున్న సినిమా కోసం అఖిల్ తన లుక్ మార్చేసాడని తెలుస్తోంది.

సీనియర్ హీరోలైన చిరంజీవి – నాగార్జున సైతం సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. మేకప్ అయినప్పటికే మెగాస్టార్ చిరంజీవి గుండు లుక్ అందరిని ఆకట్టుకుంది. ఇక కింగ్ నాగార్జున ‘బిగ్ బాస్’ కోసం మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడంతో పాటు ‘వైల్డ్ డాగ్’ సినిమా కోసం లుక్ చేంజ్ చేశాడు. ఈ సినిమాలో మిడిల్ ఏజ్ పాత్రలో కనిపించనున్న నాగ్ దీని కోసం వైట్ హెయిర్ తో కనిపించనున్నాడు. యువ హీరో నాగశౌర్య తాజా లుక్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. లాక్ డౌన్ లో భారీ వర్కౌట్స్ చేసిన శౌర్య.. త్వరలో స్టార్ట్ కాబోయే స్పోర్ట్స్ డ్రామా కోసం సిక్స్ ప్యాక్ మైంటైన్ చేస్తూ వస్తునాడు. ‘వి’ సినిమాలో కండలు తిరిగిన దేహంతో పోలీసుగా అబ్బురపరిచిన సుధీర్ బాబు.. ఇప్పుడు బాడీతో పాటు హెయిర్ కూడా పెంచేసి కొత్తగా కనిపిస్తున్నాడు.

అంతేకాకుండా అల్లు అర్జున్ తాజా ఫోటోలు చూస్తే కూడా మళ్ళీ ‘పుష్ప’ గెటప్ లోకి వచ్చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇక లాక్ డౌన్ ప్రారభంలో కాస్త బొద్దుగా కనిపించిన వరుణ్ తేజ్ – సాయి ధరమ్ తేజ్ లు మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేసి లుక్ మార్చేశారు. యువ హీరో సందీప్ కిషన్ తాను నటించబోయే సినిమా కోసం భారీ వర్కౌట్స్ చేసి ఆరు పలకల దేహాన్ని రెడీ చేశాడు. బాడీలోనే కాకుండా హెయిర్ స్టైల్ లో కూడా వేరియేషన్ చూపిస్తున్నాడు సందీప్. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పొడవాటి జుట్టుతో పాటు గడ్డం పెంచేసి కొత్త లుక్ లో కనిపించాడు. యువ హీరోలు నిఖిల్ – అడవి శేష్ – మంచు మనోజ్ కూడా కొత్త అవతారాల్లో అభిమానులను అలరిస్తున్నారు.

Related Images:

లాక్ డౌన్ లో చందమామ చిక్కిందే

చందమామ సినిమాతో తెలుగులో మొదటి సక్సెస్ ను దక్కించుకుని మగధీర సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు తన స్టార్ డంను కొనసాగిస్తూనే ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈమె పనైపోయింది అనుకున్న ప్రతిసారి కూడా తన సత్తా చాటుతూ లక్కీగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కూడా ఈమె ఇండియన్ 2 సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ లాక్ డౌన్ టైమ్ లో కొందరు స్టార్స్ వర్కౌట్స్ పై దృష్టి పెట్టక పోవడంతో కాస్త లావు అయినట్లుగా గమనించాం. కాని కాజల్ మాత్రం ఈ లాక్ డౌన్ లో కాస్త ఎక్కువగా వర్కౌట్స్ చేసిందో ఏమో కాని కాస్త సన్నబడ్డట్లుగా అనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాజల్ లుక్ సింపుల్ అండ్ స్వీట్ గా ఉందంటూ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కెరీర్ పరంగా డల్ అవుతున్న ఈ సమయంలో కాజల్ కాస్త బక్కగా మారి యంగ్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ గా మారాలనే ప్రయత్నాలు చేస్తుందేమో అంటున్నారు.

Related Images:

లాక్ డౌన్ చెర్రీ మైండ్ సెట్ మార్చేసిందా?

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలంతా పరిమిత బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవతరం హీరోలు కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తున్నారు. క్రియేటివ్ కంటెంట్ తో వస్తే ఎంకరేజ్ చేస్తున్నారు. స్క్రిప్టులో దమ్ము చూపిస్తే అవకాశం ఖాయం చేసుకున్నట్టే.

దిల్ రాజు .. డి.సురేష్ బాబు.. అల్లు అరవింద్ .. యువి అధినేతలు .. ఈ తరహా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. కానీ కొణిదెల అధినేత రామ్ చరణ్ మాత్రం కేవలం భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించేందుకే బ్యానర్ ని ప్రారంభించానని అప్పట్లో చెప్పారు. పైగా తన తండ్రితో మాత్రమే నిర్మాతగా సినిమాలు తీస్తానని అన్నారు.

కానీ ఇటీవల ఆలోచన మారింది. ఓవైపు కొణిదెల బ్యానర్ లో పెద్ద సినిమాలు తీస్తూనే .. ఇప్పుడు ఇతర బ్యానర్లలో నవతరం ట్యాలెంటుకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. చిన్న బడ్జెట్ సినిమాల్ని నిర్మించే యోచన చేస్తున్నారట. హీరోగా బిజీగా ఉన్నా.. చరణ్ స్వయంగా తన ప్రొడక్షన్ హౌస్ ను చూసుకుంటాడు. చరణ్ తన కెరీర్ పై దృష్టి పెట్టడానికి సమయం లభించకపోవడంతో అనేకమంది ఇతర నిర్మాతలు చిరుతో సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నారట. అయితే చరణ్ మాత్రం నిర్మాతగా బిజీ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో కొంత నిజం ఉంది. సొంత బ్యానర్ అభివృద్ధి కోసం చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ హీరోలతోనే కాకుండా ఇతర హీరోలతోనూ చరణ్ సినిమాలు చేయాలనుకుంటున్నారట.

కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలను రూపొందించడానికి .. కొత్త ప్రతిభను పరిచయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ లాక్ డౌన్ సమయంలో చరణ్ చాలా మంది యువ దర్శకుల నుండి చాలా మంచి కంటెంట్ (స్క్రిప్టులు) విన్నాడు. రాబోయే రోజుల్లో వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. చెర్రీ మైండ్ సెట్ ఉన్నట్టుండి మారిందా? .. కరోనా మార్చిందా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Images:

లాక్ డౌన్ లో కథానాయికల పాట్లు ఫీట్లు చూసారా

లాక్ డౌన్ పరిశ్రమకే కాదు.. అందరికీ పాఠాలు నేర్పించింది. ఈ పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఫిట్ నెస్. మహమ్మారీ తరుముకొచ్చినా ఎలాంటి అదురు బెదురు లేకుండా ఉండాలంటే మానసిక శారీరక ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. దానికి యోగా- ఎక్సర్ సైజులు సహా ధ్యానం ఎంతో ముఖ్యం.

కథానాయికలలో లాక్ డౌన్ ని సద్వినియోగం చేసుకున్న నాయికల జాబితాని పరిశీలిస్తే.. సమంత-రకుల్ ప్రీత్- తాప్సీ- పూజా హెగ్డే- కత్రిన- అదాశర్మ లాంటి భామల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ లో గార్డెనింగ్ తో పాటు యోగాను బాగా ఆస్వాదిస్తున్నానని సమంత తెలిపారు. ఇక రూఫ్ టాప్ గార్డెనింగ్ లో సమంత అనుభవం గురించి వంటగదిలో వంటకాల ప్రయోగం గురించి తెలిసినదే. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఫిట్ నెస్ విషయంలో సామ్ అస్సలు రాజీకి రాలేదు. యోగాసనాల్లో అతి క్లిష్టమైన మయూరాసనం ఈ లాక్ డౌన్ లో ప్రాక్టీస్ చేశారు సామ్.

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ విషయంలో ఎంత శ్రద్ధ కనబరుస్తుందో తెలిసిందే. యోగా జిమ్ తో నిరంతరం గంట పైగా కుస్తీ పడుతుంది రకుల్. ఇప్పటికే ఫిట్ నెస్ జిమ్ ల నిర్వహణ ప్రమోషన్స్ లో పూర్తి అనుభవం ఘడించిన రకుల్ కి ఆరోగ్యం అందంపై శ్రద్ధ అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ వర్కవుట్లు ఇప్పటికే వెబ్ లో వైరల్ అయ్యాయి.

యోగాపై రకుల్ మాట్లాడుతూ ఇది కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించినది.. మన జీవిత విధానానికి సంబంధించిన విషయం. అందుకే వర్కౌట్లో క్రమం తప్పేది లేదు అంటూ మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తెలిపింది.

అలాగే లాక్ డౌన్ సీజన్ లో ధనురాసనం నేర్చేసుకున్నానంటూ చెప్పింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. 2020 ఆరంభమే అల వైకుంఠపురములో రూపంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని అదే జోష్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. యోగా చేస్తే తెలియని సంతోషం!! అంటోంది పూజ.

ఇంట్లో వీలయ్యే వర్కౌట్స్ చేయండి.. నేను చేస్తున్నా అంటూ రాశీ ఖన్నాటెంప్ట్ చేస్తోంది. రాశీ జిమ్ వర్కవుట్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే హీట్ పెంచేశాయి. అదా శర్మ- తాప్సీ తదితరులు కూడా వర్కౌట్స్తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ ఇద్దరూ గత ఐదారేళ్లుగా రెగ్యులర్ వర్కవుట్లతో ఫిట్ నెస్ ఫ్రీక్స్ గా పాపులరయ్యారు. అదా శర్మ జిమ్ యోగాతో పాటు డ్యాన్సులతోనూ పిట్ నెస్ మంత్రం జపిస్తుందన్న సంగతి తెలిసినదే. ఇక కత్రిన.. కరీనా లాంటి సీనియర్ బ్యూటీస్ ఫిట్ నెస్ విషయంలో యోగాను నిరంతర సాధనంగా మార్చుకున్నారు.

Related Images:

ఇన్ని వేలసంఖ్యలో ఎవరికైనా సాయం అందకపోతే క్షమించండి!!

లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి సినీనటుడు సోనూసూద్.. అంటే ప్రస్తుతం దేశంలో ఆయన ఓ నటుడు మాత్రమే కాదు. ఓ మంచి మనసున్న వ్యక్తి. ఎదురువారి ఆకలి తీర్చి కన్నీళ్లు తుడిచే మనస్తత్వం.. సేవాగుణం కలిగిన రియల్ హీరో. అయితే రీల్ లైఫ్ లో విలన్ రోల్స్ పోషించే సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. సోనూసూద్ మంచి మనసుతో చేస్తున్న పని ఇది. సోను వలస కార్మికుల కష్టాలు ఎరిగిన మనిషి. ఈ క్రమంలో ఉపాధి లేక చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని ఆయన రవాణా సౌకర్యం కల్పించాడు. “పిల్లలు – వృద్ధులతో కూడిన వలస కార్మికుల్ని రోడ్లపై చూసి నా హృదయం తరుక్కుపోయింది. కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాల్లోని వలస కార్మికులకు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని సోనూసూద్ తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఛారిటీ సహాయంతో ఇప్పటి వరకు కొన్ని వేల మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరినట్లు తెలుస్తుంది. కేవలం ఒక్కడి తపన.. సంకల్పం అంతమందికి బతుకు బాట చూపించింది. అయితే లాక్ డౌన్లో ఆయన చేయగలిగింది చేసాడు సోనుసూద్.

విదేశాలలో ఇరుక్కుపోయిన వేలాది మంది వలస కార్మికులు – భారతీయ విద్యార్థులకు తమ ఇళ్లకు చేరుకోవడానికి రవాణా ఏర్పాట్లు చేసాడు. నిరుపేదలకు ఉద్యోగాలు కల్పించడం – పేదలకు ఆర్థిక సహాయం అందించడం.. ఇలా అన్నీ తాను చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా అవసరమైన వారికి సాయం అందించే మార్గం ఎంచుకున్నాడు. అయితే తాజాగా.. సోను ట్విట్టర్ వేదికగా రోజూ తనకు సాయం చేయిమని వచ్చే రిక్వెస్ట్ సంఖ్యను బయటపెట్టాడు. మెయిల్ ద్వారా 1137 – ఫేస్ బుక్ ద్వారా 19000 – ఇంస్టాగ్రామ్ ద్వారా 4812 సందేశాలు.. ఇక ట్విట్టర్ ద్వారా 6741 హెల్పింగ్ రిక్వెస్టులు ఈరోజు వచ్చినట్లు తెలిపాడు. అయితే కేవలం సగటున ఒకరోజులో వచ్చే అభ్యర్థనలు ఇవ్వని చెప్పాడు సోను. ఇక చివరిగా ఓ రిక్వెస్ట్ కూడా చేసాడు. “వేల సంఖ్యలో సాయం కోరిన బాధితులు ఉన్నారు. వారందరికీ సాయం అందించడం కష్టం. కానీ నేను అందరికి నా వంతు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరికైనా సాయం అందకపోతే క్షమించగలరు” అని కోరాడు. కానీ అన్నీ వేలమంది సాయం కోరినా తను చేయడం ఆపను అన్నాడు కదా.. అందుకు సోను చాలా గొప్పవాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Related Images: