ప్రభాస్ `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం ట్రెండీ టాపిక్. భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కనున్న 3 డి యాక్షన్ డ్రామా ఇది. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా రావణుడి పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ని ఎంపిక చేశారన్న కథనాలొచ్చాయి.
ఇంతకీ సీత ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సరైన ఆన్సర్ లేదు. సీత పాత్రకు పలువురు నాయికల పేర్లను పరిశీలించిన ఓంరౌత్ తాజాగా కృతి సనోన్ ని ఫైనల్ చేశారని కథనాలొస్తున్నాయి. కృతి తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు మహేష్ సరసన `1నేనొక్కడినే`.. నాగచైతన్య సరసన `దోచేయ్` చిత్రాల్లో నటించింది.
ఇప్పుడు క్రేజీగా డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంలో ఆఫర్ దక్కించుకుంటోందన్న వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే కృతి ఎంపికపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతానికి బాలీవుడ్ మీడియా కథనాల్లో కృతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కృతి ప్రస్తుతం బాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆదిపురుష్ 3డిని అత్యంత భారీ బడ్జెట్ తో టీసిరీస్ నిర్మించనుంది.
స్కై అబౌ.. ఎర్త్ బిలో.. అండ్ పీస్ వితిన్..! అంటూ అదిరిపోయే కొటేషన్ చెప్పింది కియరా అద్వాణీ. చూస్తుంటే తపోవనంలో మోడ్రన్ సీతలా మైమరిపిస్తోంది. అన్నిటినీ మర్చిపోయి ఎంతో హాయిగా ఇలా తపమాచరిస్తున్న కియరాను చూస్తుంటే ముచ్చటేస్తోంది కదా!
ఆకాశానికి భూమికి మధ్య ఏదో తోకచుక్క వాలినట్టుగా ఉందా లుక్కు. గలగలా పారే సెలయేటి మధ్యలో ఇలాంటి ఫీట్ వేసిందేమిటో. ఏ చెట్టో పుట్టో పట్టుకుని అక్కడ నార దుస్తులు ధరించి ఎంతో సాధా సీదాగా సీతమ్మలా సెటప్ చేయాలి కానీ.. మరీ ఇలా అల్ట్రా మోడ్రన్ సీతలా అలా వాగులో దిగి తపమాచరిస్తే మునులు ఊరుకుంటారా? దేవుళ్లు ప్రత్యక్షమవుతారా?
అయితే కియరా ఉద్ధేశం మాత్రం వేరుగా ఉంది. కేవలం మనశ్శాంతిని సంపాదించేందుకు ఇలా చేస్తే చాలు సింపుల్ గా. మంచి ప్రకృతి రమణీయతలో జీవించడమే అన్ని ఒత్తిళ్లకు సెలవిస్తుందనేది తన ఉద్ధేశం. ఇటీవల లక్ష్మీ బాంబ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయిన కియరా వేరే షెడ్యూళ్లను మ్యానేజ్ చేయాల్సొస్తోంది. మధ్యలో ఇలా రిలాక్స్ అయిపోయిందన్నమాట.
బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ గా వెలిగిపోతోంది కియరా. `లస్ట్ స్టోరీస్`తో ఈ భామ పేరు దేశం మొత్తం మార్మోగింది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ ని దక్కించుకున్న కియారా `భరత్ అనే నేను` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ మూవీ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించి మరో ఆఫర్ ని దక్కించుకుంది. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం `వినయ విధేయ రామ`. ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో కియారాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిని కూడా తన గ్రిప్ లో పెట్టుకున్న కియారాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
తాజాగా `ఆస్క్ మీ ఎనీథింగ్` అనే సెషన్ ని నిర్వహించింది. ఈ సెషన్ లో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు కియారా ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఇదే సందర్భంలో ఓ అభిమాని మరిన్ని సౌత్ చిత్రాల్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం` అని అడిగితే స్మార్ట్ గా సమాధానం చెప్పింది. `త్వరలోనే మీరు చూస్తారని` స్మార్ట్ గా తెలుగులో తను చేయబోతున్నకొత్త సినిమా ప్రాజెక్ట్ ఏంటో చెప్పకుండానే తెలుగు సినిమా చేస్తున్నానని హింట్ ఇచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న `ఆదిపురుష్` చిత్రంలో సీత పాత్ర కోసం కియారాని చిత్ర బృందం సంప్రదిస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కియారా ఇండైరెక్ట్ గా తెలుగు సినిమా చేయబోతున్నానంటూ హింట్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ హింట్ చూస్తుంటే మహానటి కీర్తి సురేష్ కి ఆ ఛాన్స్ మిస్సయినట్టేనని అంతా భావిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో రానున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ ని చూసిన సినీ అభిమానులకు ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడని అర్థం అయింది. అయితే అప్పటి నుంచి ‘రావణాసురుడు’ ‘సీత’ పాత్రలు ఎవరు పోషిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆది పురుష్’లో ప్రభాస్ ని ఢీకొట్టే ప్రతినాయకుడు ‘లంకేష్’ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కాగా ఇప్పుడు ‘సీత’ పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్.. ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే కియారా అద్వానీని ఉత్తమురాలైన సీత పాత్రలో అంగీకరిస్తారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కియారా ఇంతకముందు ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడంతో పాటు వైబ్రేటర్ సీన్ లో కూడా నటించి అందరిని షాక్ కి గురి చేసింది. అంతేకాకుండా ‘గిల్టీ’ ఒరిజినల్ మూవీలో డ్రగ్స్ తీసుకుంటూ సిగరెట్స్ మందు తాగే అమ్మాయిగా కనిపించింది. అలాంటి పాత్రల్లో నటించిన కియారా ని ఇప్పుడు ‘సీత’ పాత్రలో యాక్సెప్ట్ చేస్తారా అని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం నటీనటులు ఎలాంటి పాత్రల్లో అయినా నటిస్తారని.. అది వారి వృత్తి ధర్మం అని.. అప్పుడు బోల్డ్ గా నటించినట్లే ఇప్పుడు సాంప్రదాయ బద్దమైన పాత్రలో నటిస్తే తప్పేంటని కామెంట్ చేస్తున్నారు. మరి పాన్ ఇండియా మూవీగా రానున్న ‘ఆదిపురుష్’ లో మేకర్స్ హీరోయిన్ గా ఎవరికి ఓటేస్తారో చూడాలి.
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా `తానాజీ` ఫేం ఓం రౌత్ `ఆదిపురుష్ 3డి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం దాదాపు 500 కోట్ల మేర బడ్జెట్ ని టీసిరీస్ ఖర్చు చేయనుంది. పురాణేతిహాసం రామాయణ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారని ప్రచారమవుతోంది.
అంతేకాదు.. ఈ మూవీలో సీతా దేవి పాత్రలో ఎవరు నటిస్తారు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఓం రౌత్ కీలక పాత్రలకు నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రకు సైఫ్ అలీఖాన్ ని ఎంపిక చేసుకోగా.. పలువురు బాలీవుడ్ నటులకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.
అంతేకాదు సీతాదేవి పాత్రకు కియరా అద్వాణీ పేరును పరిశీలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఆ పాత్రకు తను సూటబులేనా? అంటే.. ఇదిగో ఈ రూపం చూస్తే `ఎస్` అనకుండా ఉండలేరు. నిలువెత్తు బుట్టబొమ్మ తీరైన రూపం ఆకట్టుకుంటోంది. ఇక సంప్రదాయ చీరకట్టులో సీతాదేవినే తలపిస్తుంది కియరా. మోడ్రన్ ఔట్ ఫిట్ కి ఎంతగా సూటవుతుందో ఇటు ట్రెడిషనల్ లుక్ కి అంతే యాప్ట్ గా ఉంటుంది. అందుకే కియరాకు ఆ పాత్ర సూటబుల్ అని భావిస్తున్నారట. ఇక ప్రభాస్ -నాగ్ అశ్విన్ మూవీలో నటిస్తున్న దీపిక పదుకొనే సైతం ట్రెడిషనల్ లుక్ కి బాగా సూటవుతుందని పద్మావత్ 3డి చూసాక అందరూ అంగీకరించారు. భాజీరావ్ మస్తానీ సహా పద్మావత్ 3డిలో రాణి పాత్రలో దీపిక అదరగొట్టింది. అందుకే సీతగానూ తను యాప్ట్ అన్న చర్చా సాగుతోంది. ఒకవేళ ప్రభాస్ వరుసగా రెండో ఛాన్స్ తనకే ఇస్తే బెటర్ ఆప్షనే అవుతుంది.