Templates by BIGtheme NET
Home >> Telugu News >> రిలయన్స్ భారీ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద జూ గుజరాత్ లో నిర్మాణం

రిలయన్స్ భారీ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద జూ గుజరాత్ లో నిర్మాణం


ప్రపంచప్రఖ్యాత వ్యాపారసంస్థ – మనదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ ఓ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నది. లాభాలు – నష్టాలు లెక్కలు వేసుకొని వ్యాపారం చేసే రిలయన్స్ ఇప్పుడు ఓ జూను నిర్మించబోతున్నది. మనదేశంలో జూలు ఎక్కువగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. రిలయన్స్ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ‘జూ’ ను మనదేశంలో నిర్మించబోతున్నది. ఇందుకు కేంద్ర – రాష్ట్రప్రభుత్వాలు కూడా అనుమతి ఇచ్చేశాయి. ప్రధాని మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో ఆ భారీ జూను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే అతిపెద్ద జూ అంటే విస్తీర్ణం పరంగా కాదు.. ప్రపంచంలో ఏ జూలో లేనన్ని జంతువులు ఇక్కడ ఉండబోతున్నాయట.

గుజరాత్లోని జామ్ నగర్ లో దీన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలో ఉండే అన్నిరకాల జంతువులు ఇక్కడ ఉండబోతున్నాయి. జంతువులు – పక్షులు – సరీసృపాలు కూడా ఉండబోతున్నాయట. రిలయన్స్ కంపెనీ జామ్ నగర్ లో జూ ను కట్టబోతున్నట్టు గుజరాత్ అధికారులు ధ్రువీకరించారు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద జూ కట్టబోతున్నామని దీనికి కేంద్ర – రాష్ట్రప్రభత్వాలు అనుమతులు ఇవ్వడం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ పేర్కొన్నారు.

అయితే ఈ జూను గ్రీన్స్ జియోలాజికల్ – రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్ డమ్ గా పిలువనున్నారు.జామ్ నగర్ లో రిఫైనరీని నడుపుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జూను నిర్మిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్య కార్యదర్శి ఎంకే దాస్ చెప్పారు. ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) గుజరాత్ లో ఉంది. ఇప్పడు అతిపెద్ద జూ కూడా గుజరాత్ లోనే నిర్మించబోతున్నారు.