Templates by BIGtheme NET
Home >> Telugu News >> చంద్రబాబు పై కుట్ర చేస్తున్నారు.. ప్రభుత్వ వెబ్‌సైట్ సాక్ష్యమన్న టీడీపీ

చంద్రబాబు పై కుట్ర చేస్తున్నారు.. ప్రభుత్వ వెబ్‌సైట్ సాక్ష్యమన్న టీడీపీ


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించింది టీడీపీ. అమరావతిని, చంద్రబాబు నివాసాన్ని ముంచడానికే ఉద్దేశపూర్వకంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు కిందకు వదలకుండా నిల్వ చేసిందని.. దీనికి సాక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి శాఖ వెబ్‌సైట్‌లోని వివరాలు అంటోంది. టీడీపీ వరుసగా ట్వీట్‌లు చేసింది. ఒక పక్క శ్రీశైలం నుంచి భారీ వరద. మరో పక్క భారీ వర్షాలతో నిన్న సాయంత్రానికి ప్రకాశం బ్యారేజి దగ్గర వచ్చే నీరు (ఇన్ ఫ్లో) 2,79,490 క్యూసెక్కులు ఉంటే .. బయటకు పంపే నీరు (అవుట్ ఫ్లో) 1,98,450 క్యూసెక్కులు ఉంది. అంటే 82,000 క్యూసెక్కులు బ్లాక్ చేసారంటున్నారు.

ప్రకాశం బ్యారేజి దగ్గర నీళ్ళు కావాలనే నిలవ పెట్టారని టీడీపీ ఆరోపించింది. కొండవీటి వాగు ఎత్తిపోతల ఆన్ చేయలేదని.. ఎందుకంటే అమరావతిని ముంచాలి, చంద్రబాబు ఇంటిని ముంచాలన్నదే కుట్ర అన్నారు. పోయిన ఏడాది కూడా ఇదే కుట్ర చేసి వైసీపీ నేతలంతా చంద్రబాబు ఇంటి దగ్గర పడిగాపులు కాసారు.. ఇంతా చేసినా వాళ్ళు అనుకున్నది కాకపోవడంతో రాత్రికి రాత్రి ఒకేసారి అవుట్ ఫ్లోను ఒకేసారి 5,64,006 క్యూసెక్కులకు పెంచేసారు. అంత నీటిని ఒకేసారి కిందకు వదిలేయడంతో విజయవాడ లోతట్టు ప్రాంతాలతో పాటు, కృష్ణా పరివాహక లంక గ్రామాలు మునిగిపోయాయి అన్నారు.

టీడీపీ నేత పట్టాభి కూడా ఇవే ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం ప్రకాశం బ్యారేజీకి పైనుంచి వస్తున్న వరద ప్రవాహం 2.70లక్షల క్యూసెక్కులు.. అదే సమయంలో దిగువకు వదులుతున్న నీరు 1.98లక్షల క్యూసెక్కులు అన్నారు. బుధవారం (14న) ఉదయానికి వెబ్‌సైట్‌లో లెక్కలు మారిపోయాయని.. పైనుంచి వస్తున్న ప్రవాహం 2.70 లక్షల క్యూసెక్కులు ఉంటే దిగువకు వదులుతున్న నీరు ఒకేసారి 5.64లక్షల క్యూసెక్కులకు పెరిగిపోయింది అన్నారు. ప్రవాహం పెరగకుండా కొన్ని గంటల వ్యవధిలోనే కిందకు వదిలే నీరు ఒకేసారి మూడురెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బ్యారేజీ నుంచి నీటిని కిందకు వదలకుండా నిల్వ చేసి.. నీరు గట్లు తెంచుకొని అమరావతిపై పడి మునిగిపోతుందని భావించారన్నారు.


నీటిని నిల్వ ఉంచినా వరద అమరావతి వైపు వెళ్లేలా కనిపించలేదని.. ఇక లాభం లేదని బుధవారం ఒకేసారి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలేశారన్నారు పట్టాభి. ఈ వరదకు విజయవాడలోని జనవాస ప్రాంతాల్లోకి నీరు చేరి ముంపునకు గురయ్యాయని.. కుట్రపూరితంగా కొడవీటి వాగు ఎత్తిపోతల పథకం మోటార్లు కూడా ఆన్‌ చేయకుండా ముంపు రావాలని కోరుకున్నారన్నారు.