తెలంగాణలో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు బంద్!
తెలంగాణలో రేపటి నుండి రిజిస్ట్రేషన్ పక్రియ ఆపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు నుండి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఈ రోజు ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినట్లు సమాచారం.కొత్త రెవెన్యూ చట్టం ఆధారంగా రాబోయే రోజుల్లో […]
