Templates by BIGtheme NET
Home >> Cinema News >> రూం రెంట్ కోసం ఆ సినిమాలు చేశా

రూం రెంట్ కోసం ఆ సినిమాలు చేశా


విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న అడవి శేష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ప్రస్తుతం ఈయన చేస్తున్న మేజర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటు ఆ సినిమా వివరాలను వెళ్లడించారు. ఈ సమయంలోనే ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మాట్లాడాడు. అమెరికాలో మంచి ఉద్యోగంను సినిమాల కోసం వదిలేసి వచ్చిన నేను నా వద్ద ఉన్న డబ్బులతో సినిమాను నిర్మించి తప్పు చేశాను. మొదటి సినిమాతోనే నా వద్ద ఉన్న డబ్బులు అన్ని కూడా పోగొట్టుకున్నాను. దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

నాన్న సినిమాల్లో రాణించాలని అనుకున్నారు. కాని ఆయన చిన్నతనంలోనే యాక్సిడెంట్ వల్ల సినిమాల్లోకి రాలేక పోయారు. నాకు సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఆయన నుండి ప్రేరణ పొంది సినిమాల్లో నటించేందుకు వచ్చాను. హీరోగా చేస్తున్న సమయంలోనే పంజా సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు అడిగారు. ఆ సమయంలో నా స్నేహితులు చాలా మంది నటించమంటూ ప్రోత్సహించారు. దాంతో పంజాలో నటించాను. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో నా కెరీర్ మళ్లీ మొదటికి వచ్చనట్లయ్యింది.

పంజా సినిమా నిరాశ పర్చినా కూడా ‘కిస్’ సినిమాను చేశాను. ఆ సినిమాకు నేను పెట్టబడి పెట్టాను. సినిమా నిరాశ పర్చడంతో ఒకానొక సమయంలో నేను రూం రెంట్ కట్టలేక ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నేను ఎంపిక చేసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్క సినిమాను చేశాను. ఆ సమయంలో కొన్ని ఇష్టం లేకుండా కూడా చేయాల్సి వచ్చింది. డబ్బు కోసం చేసిన సినిమాలు ఆడలేదు అన్నాడు. ప్రస్తుతం రియల్ హీరో మేజర్ ఉన్ని కృష్ణనన్ బయోపిక్ లో చేస్తున్నాను. మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల ఉంటుందని అడవి శేష్ అన్నాడు.