Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ప్రోమో విడుదల.. ‘కోటి మీదే’ అంటున్న ఎన్టీఆర్

‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ప్రోమో విడుదల.. ‘కోటి మీదే’ అంటున్న ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్డేట్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న అప్డేట్ రానే వచ్చింది. మోస్ట్ అవెయిటింగ్ టెలివిజన్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’తో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదివరకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే పేరుతో నాలుగు సీజన్లు విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. మొదటి మూడు సీజన్లకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరించగా.. నాలుగో సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్. ఇప్పుడు ప్రసారం కానున్న ఐదవ సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది జెమినీ టీవీ యాజమాన్యం.

ప్రోమోతో పాటు ఎన్టీఆర్ ఆఫీసియల్ లుక్ కూడా ఈరోజు ఉదయం 11గంటలకు రిలీజ్ చేసింది. జెమినీ టీవీలో ఈ షో ప్రతి వారాంతంలో ప్రసారం కానుంది. ప్రతి శని ఆదివారాలలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి సీసన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అయితే ఇదివరకు మీలో ఎవరు కోటీశ్వరుడు షో నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయ్యాయి. ఈ సారా ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోను రెడీ చేశాడట. దీనికి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. జెమినీ గ్రూప్ కు చెందిన సన్ నెక్ట్స్ ఓటీటి యాప్ లో కూడా ఈ షో ప్రసారం కాబోతుంది.

గతంలో విడుదల చేసిన ప్రోమోలో చైర్లో హోస్ట్ కూర్చుని ఉన్నారు. అయితే ఆయన ముఖాన్ని నేరు చూపకుండా ఓ షాడోను చూపించారు. తాజా ప్రోమోలో ఎన్టీఆర్ ఆట గురించి వివరించాడు. అలాగే చివరలో ఇక్కడ నుండి ఎంత పట్టుకెళ్తారో నాకు తెలీదు కానీ.. లైఫ్ లో గెలవగలను అనే కాంఫిడెన్స్ మాత్రం పట్టుకెళ్తారు అనే మాటలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ‘ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వరుడు’ అంటూ ప్రోగ్రాం పై ప్రేక్షకులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ప్రోమో రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే షో ప్రారంభం అవుతుండటంతో జనాలు హ్యాపీ అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=quA5vQOeTyU