Templates by BIGtheme NET
Home >> Cinema News >> బచ్చన్ జీ జీవితంలో ఎప్పుడూ ఇంతగా ఎమోషన్ కాలేదు!

బచ్చన్ జీ జీవితంలో ఎప్పుడూ ఇంతగా ఎమోషన్ కాలేదు!


బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే కోవిడ్ 19కి చికిత్స పొంది రికవరీ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావడంతో అభిమానులు ఊపిరి తీసుకున్నారు. అయితే అప్పుడు కూడా అమితాబ్ అంతగా ఎమోషన్ అవ్వలేదు. కానీ ఈరోజు ఆయన చేసిన ఎమోషనల్ ట్వీట్ అందరి హృదయాల్ని కాస్త డెప్త్ తోనే టచ్ చేసింది.

ఆయన తన తండ్రిగారైన.. దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు మీద వ్రోక్లా(పోల్యాండ్)లోని స్క్వేర్ చిత్రాన్ని పంచుకున్నారు. దీనికి ఆయన దివంగత తండ్రి.. ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు పెట్టారు. తన కుటుంబానికి భారతదేశానికి ఎంతో గర్వకారణమిదని ఈ సందర్భంగా బిగ్ బి పేర్కొన్నారు.

“పోలాండ్లోని సిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ వ్రోక్లా నా తండ్రి పేరును ఒక స్క్వేర్ (చతురస్ర నిర్మాణం) కి పెట్టాలని నిర్ణయించుకుంది .. దసరా రోజున ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం వేరొకటి ఉండకపోవచ్చు . ఇది మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే వ్రోక్లాలోని భారతీయ సమాజం ..చేస్తున్నది ఇది. జై హింద్ ”
అంటూ ఎమోషన్ కి గురయ్యారు అమితాబ్. దేశం కాని దేశంలో నా తండ్రి ఈ గౌరవానికి అర్హుడు. నేను కాదు. ఇది నా తండ్రిని గౌరవించే దేశం. కొడుకుకు ఎక్కువ గౌరవం ఇచ్చే క్షణం ఉండకూడదు అంటూ ఎంతో ఎమోషన్ కి అమితాబ్ గురయ్యారు.

బిగ్ బి సహచరులు చాలా మంది ఈ వార్తలపై స్పందించారు. నటుడు రణవీర్ సింగ్.. సునీల్ శెట్టి ..యు షమితా శెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమోజీల సమూహాన్ని షేర్ చేశారు. టీవీ నటుడు అహానా కుమ్రా ఇలా రాశారు.. “ఎంత అద్భుతమైన @amitabhbachchan సార్ !! అద్భుతమైన వార్తలు! హ్యాపీ దసరా! అంటూ ఎగ్జయిట్ అయ్యారు.

2019 డిసెంబరులో తన తండ్రి పేరు మీద ఒక చతురస్రానికి పేరు పెట్టాలని వ్రోక్లా నిర్ణయించుకున్నట్లు అమితాబ్ ప్రకటించారు. అతను తన తండ్రిని గౌరవించటానికి ఆ దేశంలోని ఒక చర్చి నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. “యూరప్లోని పురాతన చర్చిలలో ఒకదానిలో పోలాండ్లోని బాబూజీ కోసం ఒక ప్రార్థన .. అంతగా మనసును తాకిన అలాంటి భావోద్వేగ క్షణం .. అతని ఆత్మకు శాంతి తో ప్రేమతో .. బిషప్ మరియు పోలాండ్ ప్రజలకు ధన్యవాదాలు .. అటువంటి గౌరవం దక్కినందుకు“ అని అప్పట్లో ట్వీట్ చేశారు. గౌరవం యతో నిండిన పోలాండ్ ప్రజలు .. 300 సంవత్సరాల పురాతన చర్చి ఇది.. WW 2 సమయంలో నగరంలో 85% కంటే ఎక్కువ నాశనమైనది.. . కానీ ఈ చర్చిని మాత్రం యుద్ధం తాకలేదు అని తెలిపారు.