Templates by BIGtheme NET
Home >> Cinema News >> అప్పన్న సన్నిధిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి

అప్పన్న సన్నిధిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి


సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని మంగళవారం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కప్ప స్తంభాన్ని మొక్కుకున్నారు. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎఫ్ -2 సినిమా గ్రాండ్ సక్సెస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కు కథ సిద్ధమైంది. ఎఫ్ -3 సినిమాలోనూ వెంకటేష్ వరుణ్ తేజ్ లే హీరోలుగా నటించనున్నారు. దిల్ రాజే నిర్మించనున్నారు. లాక్ డౌన్ సమయం నుంచి అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు. చిత్రీకరణకు ముందస్తు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం అనిల్ రావిపూడి కుటుంబసమేతంగా సింహాసనానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఎఫ్ -3 స్క్రిప్ట్ ని స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఏఈవో కె.కె. రాఘవ కుమార్ అనిల్ రావిపుడికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ హీరో శ్రీ విష్ణు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఓ సినిమాను అరకు లోనే పది రోజుల పాటు షూటింగ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు.

ఈనెల 5వ తేదీ నుంచి వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించే ఎఫ్ -3 సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఎఫ్ -2 సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. సుమారు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించించింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఎఫ్ -3 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.