Templates by BIGtheme NET
Home >> Cinema News >> నాని తనలో తానే ఘర్షణ పడుతున్నాడా?

నాని తనలో తానే ఘర్షణ పడుతున్నాడా?


ఒక సినిమా స్క్రిప్టు కోసం ఏడాది పాటు దర్శకుడితో కలిసి పని చేశాకా.. ఆ సినిమా నుంచి బ్యానర్ తప్పుకోవడం అంటే ఆషామాషీనా? ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ లేకుండా ఉంటుందా? కంటెంట్ పై నమ్మకం లేకపోవడమో లేక బడ్జెట్ స్కేల్ పరంగా విభేధమో ఇంకేదో ఉండే ఉంటుంది. నాని తాజా ప్రాజెక్టు గురించి అలాంటి చర్చే సాగుతోంది.

ఇంద్రగంటి `వి` రిలీజయ్యాక.. టక్ జగదీష్ తో నాని ఫుల్ బిజీ అయ్యాడు. ప్యారలల్ గా వేరొక క్రేజీ బ్యానర్ స్క్రిప్టుపైనా వర్క్ చేశాడు. అంతా బాగానే అయ్యింది. దర్శకుడు వినిపించిన ఫైనల్ స్క్రిప్టు నానీకి నచ్చింది. కానీ ఆ బ్యానర్ లో సినిమా చేయడం లేదు. వేరొక నిర్మాత నానీతో చేతులు కలిపారు. ఇంతకీ ఏమైంది? అంటే.. పునర్జన్మల నేపథ్యం స్క్రిప్టు కాబట్టి బడ్జెట్ పరంగా డిఫరెన్సెస్ అన్న గుసగుసలు వినిపించాయి.

అయితే తాను నమ్మిన స్క్రిప్టుతో బ్లాక్ బస్టర్ కొడతానని నానీ పందెం కాస్తున్నాడట. నమ్మి పని చేస్తాను.. విజయం సాధిస్తాను అని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. శ్యాం సింఘరాయ్ అంటూ ఇప్పటికే టైటిల్ ని లాంచ్ చేశారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయనున్నారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ రాసిన స్క్రిప్ట్ పై నానీకి పూర్తి నమ్మకం ఉంది. టక్ జగదీష్ తర్వాత దీనిని తన తక్షణ ప్రాజెక్టుగా చేయాలని నిర్ణయించుకోవడానికి కారణమిదేనట. ఇందులో సాయి పల్లవి- కృతి శెట్టిలు కథానాయికలుగా నటిస్తున్నారు. నవతరం దర్శకుడితో రొటీన్ కి భిన్నంగా ఆలోచించి ఈ సినిమా చేస్తుండడంతో ఒకటే ఆసక్తి నెలకొంది.