Templates by BIGtheme NET
Home >> Cinema News >> పూజా.. తన హీరోల్ని వర్ణిస్తోందా.. బిస్కెట్ వేస్తోందా?

పూజా.. తన హీరోల్ని వర్ణిస్తోందా.. బిస్కెట్ వేస్తోందా?


అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే లైనప్ చూస్తే మరింత క్రేజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లో పలు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్- రణవీర్ సింగ్ – సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. రాధే శ్యామ్- సిర్కస్ – కబీ ఈద్ కబీ దీవాళి(సల్మాన్) వంటి చిత్రాలలో నటిస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో పూజా ఆ ముగ్గురు స్టార్ హీరోల గురించి ఫన్నీ వర్ణణ చేయడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. రెబెల్ స్టార్ -గూఫీ అని.. అతను ఒక్కడే కనిపించినా ఇక ఇంటర్వ్యూల్లో సిగ్గు పడడు అని ఫన్నీగా చెప్పేసింది.

పూజా తన సిర్కస్ సహనటుడు రణవీర్ సింగ్ ను `బాల్ ఆఫ్ ఎనర్జీ` అని వర్ణించింది. చివరగా సల్మాన్ గురించి చెబుతూ..“పట్టణంలో చక్కని వ్యక్తి.. నిజమైన అరుదైన వ్యక్తి“ అని అభివర్ణించింది. తన హీరోల్ని ఎంత గొప్పగా వర్ణించిందో కదా!! అన్నట్టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ గురించి ఏమీ చెప్పనే లేదేంటబ్బా!! ఇంతకీ పూజా.. తన హీరోల్ని వర్ణిస్తోందా.. బిస్కెట్ వేస్తోందా? తొందర్లేనే తేల్తుంది!