Templates by BIGtheme NET
Home >> Cinema News >> కంగనకు మద్దతుగా జాతీయ మహిళా కమిషన్

కంగనకు మద్దతుగా జాతీయ మహిళా కమిషన్


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రౌనత్ తాజాగా సోషల్ మీడియా ద్వారా నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య అని.. బాలీవుడ్ సినీ మాఫియానే చంపేసిందని ఆరోపిస్తోంది. ఇక మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపై కూడా మండిపడుతోంది.

ఈ క్రమంలోనే ఆమెకు శివసేన నేతలు కూడా బాగానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నైక్ ఏకంగా కంగనాను బెదిరించాడు. ఇది పెద్ద వివాదాదమైంది.

ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ స్పందించారు. ఎమ్మెల్యే ప్రతాప్ సార్నైక్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

కంగనాను బెదిరించిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి. కంగనకు మద్దతుగా తాను ఉన్నానని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ సంచలన ప్రకటన చేశారు.

తనకు ముంబై.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లా కనిపిస్తోందని ఇటీవల కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.