తెలుగు బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ లలో సినిమాల ప్రమోషన్ కు లేదంటే.. కుటుంబ సభ్యులు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేవారు. కాని ఈసీజన్ లో మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్స్ తప్ప మరెవ్వరు వెళ్లలేదు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను గ్లాస్ వాల్ ఉంచి చూపించారు. ఇక రీ యూనియన్ అంటూ ఎలిమినేట్ అయ్యి పోయిన కంటెస్టెంట్స్ ను కూడా గ్లాస్ వాల్ తోనే చూపించారు. మరో రెండు రోజుల్లో పూర్తి అవ్వబోతుంది కదా రీ యూనియన్ గత సీజన్ ల మాదిరిగా ఉంటే పోయేది కదా అంటూ చాలా మంది అనుకున్నారు. కాని ముందు నుండి చివరి వరకు అదే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చారు.
కాని చివరి రోజు ఎపిసోడ్లో మాత్రం ఆ రూల్ ను బ్రేక్ చేశారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కాకుండా బయటి వారు బిగ్ బాస్ లోకి వెళ్లిన వారిగా అనీల్ రావిపూడి మరియు మెహ్రీన్ లు నిలిచారు. వీరిద్దరు హౌస్ లోకి వెళ్లి సందడి చేశారు. అనీల్ రావిపూడి ఒక్కో కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ ఆట పట్టించాడు. ఇది నిన్న షూట్ జరిగిందని అంటున్నారు. అనీల్ రావిపూడి మరియు మెహ్రీన్ లు లోనికి వెళ్లడంతో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. లోనికి వెళ్లిన అనీల్ రావిపూడి మరియు మెహ్రీన్ లు ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకు వచ్చారు. అరియానా మరియు హారికలు ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరిని వీరు బయటకు తీసుకు వచ్చి ఉంటారు. నేడు సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ 4 ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం అవ్వబోతుంది.
#BBTeluguGrandFinale Day!!!
So many surprises and too much fun on #BiggBossTelugu4 from 6 PM today on @StarMaa @iamnagarjuna @AnilRavipudi @MusicThaman @Mehreenpirzada @pranitasubhash pic.twitter.com/xvuIiGA69n
— starmaa (@StarMaa) December 20, 2020