Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రేక్షకులూ కష్టాల్లో ఉన్నారు.. దయచేసి వారిని ఇబ్బంది పెట్టొద్దు

ప్రేక్షకులూ కష్టాల్లో ఉన్నారు.. దయచేసి వారిని ఇబ్బంది పెట్టొద్దు


సాయి ధరమ్ తేజ్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. సుదీర్ఘ కాలంగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఎట్టకేలకు ఈ సినిమాతో చాలా థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. దాంతో ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

ఈ సినిమాలో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి పరోక్షంగా కీలక పాత్రలో కనిపించారు. సినిమాలో హీరో నారాయణ మూర్తి అభిమానిగా కనిపించారు. సినిమాలో తనను పరోక్షంగా భాగం చేసినందుకు దర్శకుడికి దన్యవాదాలు అంటూ ఎర్రన్న పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమా దేశ వ్యాప్తంగా రిలీజ్ లకు మార్గం వేసింది.

కరోనా కష్టకాలంలో సినిమా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ప్రేక్షకులు కూడా కష్టాలు పడుతూ ఉన్నారు. కనుక వారిని ఇబ్బంది పెట్టే విధంగా పెద్ద సినిమాల వారు టికెట్ల రేట్లు పెంచవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. థియేటర్ల పునః ప్రారంభం ఆనందంగా ఉందని ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే విధంగా టికెట్ల రేట్లను పెంచకూడదంటూ నారాయణమూర్తి సూచించారు.