Templates by BIGtheme NET
Home >> Cinema News >> సాక్షుల్ని ప్రభావితం చేసేందుకే రియా ఇంటర్వ్యూలు?

సాక్షుల్ని ప్రభావితం చేసేందుకే రియా ఇంటర్వ్యూలు?


సుశాంత్ సింగ్ కేసు విషయమై ఓవైపు కోర్టులో విచారణ సాగుతుండగానే మరోవైపు రియా చక్రవర్తి మీడియా ఇంటర్వ్యూలు సంచలనంగా మారాయి. కోర్టు విచారణలో ఉండగా ఇలా చేయడం సబబేనా? దీని ఉద్ధేశమేమిటి? అంటూ ప్రస్తుతం నెటిజనులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

రియా చక్రవర్తి ఇంటర్వ్యూ నిందితులు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నమేనంటూ తాజాగా ఎన్.సి.బి (నార్కోటిక్స్ అధికారులు) పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి కోర్టుకెళ్లే ఒక రోజు ముందు కొన్ని ప్రత్యేక మీడియా ఇంటర్వ్యూలలో మాట్లాడింది. ఆమె తనపై చేసిన కొన్ని ఆరోపణలకు సంబంధించి తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించడమే కాక తెలియని కొన్ని అంశాలను బయటికి పంచేందుకు తనకు కేసు ఫేవర్ గా మారేందుకు నానా విధాలా ప్రయత్నించింది. అయితే ఇలా చేయడం మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (నార్కోటిక్స్ అధికారులు) కు సమ్మతం గా లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. రియా ఇంటర్వ్యూలతో నిందితులు అలానే సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు నార్కోటిక్స్ బృందానికి (ఎన్.సి.బి) చెందిన వర్గాలు పేర్కొన్నాయి.

అంతే కాదు.. ఆమె ఇంటర్వ్యూల వెనుక ప్రత్యేక ఉద్దేశ్యాలు ఉన్నాయని.. అవి కూడా తెరవెనక కొందరి స్కానర్ కింద ఉంటాయని ఎన్.సి.బి తెలిపింది. ఎన్సిబి మాత్రమే కాకుండా సిబిఐ కూడా వాటిని పరిశీలించి దర్యాప్తును సాక్షులను ఎలా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారో విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. సిబిఐ ఇప్పటికే శుక్రవారం నాడు రియాని ప్రశ్నించింది. ఎన్.సి.బి ఆమెను కూడా పిలిపించే అవకాశం ఉంది.

రియా ఆమె సోదరుడు షోయిక్ సిబీఐ విచారణ తర్వాత డీఆర్డీఓ గెస్ట్ హౌస్ నుండి నిన్నటి సాయంత్రమే బయటపడిన సంగతి తెలిసిందే. ఆమెను మళ్లీ పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రియా ముంబై శాంటాక్రజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిందట. పోలీసులు సదరు నటిని ఎస్కార్ట్ చేశారు. అంతేకాదు.. రియా భద్రత కోసం పోలీసు సిబ్బందిని నియమించాలని పోలీస్ శాఖను కోరిందిట.