Templates by BIGtheme NET
Home >> Cinema News >> నైట్ షూట్ లో కియరా తపన చూస్తే షాకే

నైట్ షూట్ లో కియరా తపన చూస్తే షాకే


బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది కియరా అద్వాణీ. బాలీవుడ్ లో పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. ప్రస్తుతం కియారా అద్వానీ `జగ్ జగ్ జీయో` నైట్ షూట్ లో పాల్గొంటోంది. లైవ్ లొకేషన్ నుంచి తాజాగా స్నీక్ పీక్ ను పంచుకుంది. తన షాట్ కోసం వేచి చూస్తూ ఉన్న కియరా ఫోటో ఇలా షేర్ చేయగానే అది యువతరంలో వైరల్ గా మారింది.

కియారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా రెగ్యులర్ వ్యాపకాల్ని షేర్ చేస్తోంది. చండీఘర్ లో ప్రస్తుతం `జగ్ జగ్ జీయో` చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. నీతి కపూర్- అనిల్ కపూర్ – వరుణ్ ధావన్లతో కలిసి కియరా షూట్ లో బిజీగా ఉంది. తెరవెనుక ఫోటోలతో సోషల్ మీడియా పోస్ట్ లతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇదివరకూ కియారా తన వానిటీ వ్యాన్ నుంచి ఒక ఫోటోను లీక్ చేసింది. అక్కడ ఆమె కుర్చీపై కూర్చుని ఆమె షాట్ కోసం వేచి ఉంది. మోనోక్రోమ్ ఫోటోలో లెహంగా ధరించి కనిపించింది. ఆమె వానిటీ వాన్ లో ఓపికగా కూర్చుని తన ఫోన్ ద్వారా బ్రౌజ్ చేయడం కనిపించింది.

కియరా నటిస్తున్న `ఇందూ కి జవానీ` 2020 డిసెంబర్ 11 న థియేటర్లలో విడుదల కానుంది. అబీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య సీల్ కీలక పాత్రలో నటించారు. అలాగే `షేర్ షా`లో సిదార్థ్ మల్హోత్రాతో కూడా కియారా కనిపిస్తుంది. ఈ చిత్రం కార్గిల్ వార్ హీరో అయిన దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. దీనిని విష్ణువర్ధన్ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత నిర్మిస్తున్నారు.