Templates by BIGtheme NET
Home >> Cinema News >> శ్రావణి గురించి శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

శ్రావణి గురించి శ్రీరెడ్డి సంచలన కామెంట్స్


హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించి ఇద్దరిని నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రావణి ఆత్మహత్య కేసులో తాజాగా శ్రీరెడ్డి స్పందించింది.

‘శ్రావణి ఒక అమాయకురాలు అని అర్థమైపోతోంది. ఎమోషన్స్ కు బలైందని తెలిసిపోతోంది. ఈ సాయి దేవరాజ్ అబ్బాయిల మనస్తత్వం ప్రేమ కనపడుతోంది. మిస్ అండర్ స్టాండింగ్ వల్లే అమ్మాయి చనిపోయినట్టు తెలుస్తోంది’ అని చెబుతూ శ్రీరెడ్డి ఒక వీడియోను షేర్ చేసింది.

అబ్బాయిలు నో చెబితే మనం ఎందుకు చనిపోవాలని.. ఎందుకంత ఎమోషనల్ గా వీక్ గా ఉంటున్నారని శ్రీరెడ్డి సూచించింది. ఒక మనిషి లేకపోతే బతకలేమా? పుట్టేటప్పుడు పది మందిని పట్టుకొచ్చామా? ఒంటరిగానే కదా పుట్టాం.. చనిపోయేటప్పుడు ఒంటరిగానే కదా పోతాం’ అని శ్రీరెడ్డి పేర్కొంది.

అందరూ దైర్యంగా ఉండాలని.. ఆత్మహత్యలు చేసుకోకండని.. కలల్లో బతకకండి.. ప్రాక్టికల్ గా ఉండండి అని శ్రీరెడ్డి సలహా ఇచ్చింది. కట్టేకాలే వరకు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా బతకాలని.. ఎందుకు ఉరివేసుకుంటున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు. ఆ ధైర్యాన్ని మీరు బతకడంలో ఎందుకు పెట్టడం లేదో అర్థం కావడం లేదు.

రెడ్లలో పుట్టి.. రెడ్ల పరువు తీసేశారు సాయి దేవరాజ్ లు.. ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు చావండని శ్రీరెడ్డి శాపనార్థాలు చెప్పారు. ఆ అమ్మాయి వీడికి ఎంతో సాయం చేసిందని.. కనీసం విశ్వాసం కూడా లేదా అని శ్రీరెడ్డి వాపోయింది. మనం ఎంపిక చేసుకు జీవిత భాగస్వామి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి అని సలహా ఇచ్చింది.