Templates by BIGtheme NET
Home >> Cinema News >> టాలీవుడ్ డైరెక్టర్ కి చుక్కలు చూపిస్తున్న మాజీ మిస్ ఇండియా…?

టాలీవుడ్ డైరెక్టర్ కి చుక్కలు చూపిస్తున్న మాజీ మిస్ ఇండియా…?


టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది లేటెస్టుగా ”బ్లాక్ రోజ్” అనే చిత్రాన్ని క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటిస్తోంది. షేక్స్ పియర్ రచన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఈ ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. ఊర్వశి రౌతెలా టాలీవుడ్ డెబ్యూగా వస్తున్న ‘బ్లాక్ రోజ్’ కథ చాలా హాట్ హాట్ గా సాగుతుందని తెలుస్తోంది.

కాగా సంపత్ నంది ప్లాన్ ప్రకారం ఈ సినిమాని ముందుగా హిందీ తెలుగు భాషల్లో తీసి.. ఆ తరువాత మిగతా భాషల్లోకి డబ్ చేద్దామనుకున్నాడట. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం విషయంలో ఊర్వశీ రౌతేలా మేకర్స్ కి చుక్కలు చూపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ‘బ్లాక్ రోజ్’ సినిమాని ముందు హిందీలో రిలీజ్ చేసి ఆ తరువాత తెలుగులో విడుదల చేయాల్సిందిగా ఊర్వశి ప్రెజర్ చేస్తోందట. అంతేకాకుండా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర మిగతా షూట్ మొత్తం ముంబైలో చేయాల్సిందిగా ఈ హాట్ బ్యూటీ కండిషన్స్ పెడుతోందట. బాలీవుడ్ లో తనుకున్న ఫేమ్ పోతుందేమో అనే భయంతోనే ఊర్వశీ ఈ విధంగా ఆలోచిస్తోందట. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీని టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్న సంపత్ నందికి అమ్మడి వ్యవహారం తలనొప్పిగా మారుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.