కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న హీరోగా బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాడు యశ్. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న మన రాఖీ భాయ్.. రీసెంటుగా తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిపారు. యష్ తన కొడుకుకి ‘యథర్వ యష్’ అనే పేరు పెట్టారు.
కాగా యష్ 2016లో హీరోయిన్ రాధిక పండిట్ ని వివాహం చేసుకున్నాడు. వీరికి ముందు ఐరా అనే పాప జన్మించింది. ఇక యశ్ – రాధిక దంపతులకి ఇటీవల కుమారుడు జన్మించాడు. అయితే తనయుడి నామకరణమహోత్సవం జరిపించాలనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది. దీంతో ఇన్నిరోజులు వెయిట్ చేసి సోమవారం రోజున నామకరణ వేడుక జరిపించారు. తమ ఫాం హౌజ్ లో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తన కుమారుడికి ‘యధర్వ్ యష్’ అనే పేరుని పెట్టినట్టు యష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తన భార్య కొడుకుతో ఉన్న ఫోటోలను షేర్ చేసాడు. యశ్ కుమారుడిని చూసిన అభిమానులు జూనియర్ రాకీ భాయ్ వచ్చేశాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ యష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించడానికి మేకర్స్ సన్నాహకాలు చేసుకుంటున్నారు.
View this post on Instagram