Templates by BIGtheme NET
Home >> Cinema News >> మెగా హీరో మూవీని ‘పే పర్ వ్యూ’ విధానంలో రిలీజ్ చేస్తారా…?

మెగా హీరో మూవీని ‘పే పర్ వ్యూ’ విధానంలో రిలీజ్ చేస్తారా…?


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు రెండు వీడియో సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి స్టార్ట్ చేసి చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే ఇన్నాళ్లు ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేస్తారని అనుకుంటున్న తరుణంలో ఈ మూవీని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

కాగా జీ 5 ఒరిజినల్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి సుమారు రూ.33 కోట్లకు తీసుకుందని ఓటీటీ వర్గాల్లో అనుకుంటున్నారు. అయితే ఇంత భారీ రేట్ పెట్టి మెగా హీరో సినిమాని తీసుకున్నా.. జీ 5 ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎంత మందికి రీచ్ అవుతుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో జీ 5 యాప్ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. దానికి ఇక్కడ సబ్ స్క్రైబర్స్ గా కూడా మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ మందే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను లిమిటెడ్ ఆడియెన్స్ మాత్రమే చూస్తారని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో జీ 5 వారు ‘సోలో బ్రతుకే..’ చిత్రాన్ని ఏటీటీ పద్ధతిలో పే పర్ వ్యూ ఫార్మాట్ లో అందుబాటులో తీసుకురాబోతున్నారని సమాచారం. ఈ విధంగా జీ 5 యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న వారు ఈ సినిమా వరుకు మాత్రమే డబ్బులు చెల్లించి చూడాల్సి ఉంటుందట. ఇప్పటి వరకు ప్రముఖ ఓటీటీలల్నీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని సబ్ స్క్రైబర్స్ తీసుకున్న వారికి అనేక చిత్రాలు అందుబాటులో ఉంచుతూ వస్తున్నాయి. అయితే జీ 5 వారు మాత్రం సినిమాని కొన్న డబ్బులు వెనక్కి రాబట్టుకోవడానికి ఈ మూవీ వరకు పే పర్ వ్యూ విధానంతో వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారట. ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ రైట్స్ కూడా జీ 5 వారికే అనే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో థియేటర్స్ ఓపెన్ చేసాక ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తారేమో చూడాలి. అయితే పాపులర్ యాప్స్ కి కాకుండా జీ 5 వారికి ఇవ్వడం అనేదే తప్పుడు నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.