పిండం.. 15 ఏళ్ళ తరువాత వచ్చిన విజయం
హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ చిత్రం పిండం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకూ షోలు పెంచుకుంటూ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం.. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం విజయోత్సవ సభను నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా హీరో శ్రీరామ్ మాట్లాడారు. “మా పిండం మూవీని ప్రేక్షకులకు చేరువ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నిజాయతీగా సినిమా చేస్తే గెలిపిస్తామన్న నమ్మకాన్ని మరోసారి ఇచ్చారు. […]
