Templates by BIGtheme NET
Home >> Telugu News >> ముఖేష్ అంబానీ తాత అయ్యాడు

ముఖేష్ అంబానీ తాత అయ్యాడు


బిలియనీర్ ముకేష్ అంబానీ ప్రమోషన్ అందుకున్నారు. అంటేబిజినెస్లు వ్యాపార సామ్రాజ్యాల్లో కాదు.. కుటుంబం పరంగా ఆయన ఈ ప్రమోషన్ను అందుకున్నారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రి అయ్యాడు. దీంతో ముకేష్ అంబానీ తాత అయ్యారు. శోక్లా-ఆకాశ్ అంబానీ దంపతులకు ముంబైలో గురువారం ఓ మగ శిశువు జన్మించాడు.

ప్రస్తుతం తల్లి కొడుకు ఇరువురు క్షేమంగా ఉన్నట్లు అంబానీ కుటుంబ అధికార ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. వజ్రాల వ్యాపారి రుస్సెల్ మెహతా కుమార్తె శోక్లాతో ఆకాశ్ వివాహం మార్చి 2019లో జరిగిన విషయం తెలిసిందే. అంబానీ నీతా దంపతులకు ముగ్గురు సంతానం. 29 ఏళ్ల కవలలు ఆకాశ్ ఇషా అనంత్.

ఈ మేరకు అంబానీ కుటుంబం గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్ అంబానీ తల్లిదండ్రులయ్యారు. వారికి కుమారుడు జన్మించాడు. నీతా- ముఖేష్ అంబానీ మొదటిసారిగా నానమ్మ- తాతయ్య అయ్యారు. ధీరూభాయి- కోకిలాబెన్ మునిమనవడికి స్వాగతం పలకడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కొత్త సభ్యుడి రాకతో మెహతా- అంబానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది’’ అంటూ శుభవార్తను పంచుకుంది.