Templates by BIGtheme NET
Home >> Cinema News >> స్వలింగ సంపర్కురాలిగా మారిన అదా

స్వలింగ సంపర్కురాలిగా మారిన అదా


ప్రయోగాలు చేయడంలో కుర్రబ్యూటీ అదాశర్మ తర్వాతనే. ఈ భామ ఇటీవల వరుస ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తూ కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేసేస్తోంది. ఇటీవల విడుదలైన `పతి పత్ని ఔర్ పంగా` అనే వెబ్ సిరీస్ లో ట్రాన్స్-ఉమెన్ గా అదా శర్మ నటించింది.. లింగ విభేధం స్వలింగ సంపర్కం నేపథ్యంలో ప్రత్యేక వ్యక్తుల కథల్లో భాగం కావాలని కోరుకున్నానని తెలిపింది అదా. `పతి పత్ని ఔర్ పంగ`లో శివానీ భట్నాగర్ పాత్రను పోషించాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రేరేపించే అంశం ఏమిటో ఆలోచించాను. గొప్ప పాత్రలు కావాలని అనుకుంటే నాకు ట్రాన్స్-ఉమెన్ పాత్ర పోషించే అవకాశం లభించదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే ఆలోచనలో ప్రత్యేకమైన వ్యక్తి పాత్రను చేయడం కష్టమనిపిస్తుంది. నట ప్రదర్శన పరంగా భిన్నంగా ఉండే పాత్రను ఎంచుకోవాలి.

కొన్ని సమయాల్లో అవతలి వ్యక్తి దృక్పథం మనకు అర్థం కాదు. నటనపై ఆ పాత్రపై తీర్పు చెప్పనంత కాలం అది బాగానే ఉందని భావిస్తాం. తన పాత్రల ఎంపికలను ప్రజలు నిర్ణయించారని అదా వెల్లడించింది.

2008లో 1920 చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టాను. హారర్ సినిమాలో వికృతమైన రూపంతో ప్రయోగమే ఇది. `కమెండో 2`లో నేను అధికంగా మాట్లాడే అమ్మాయిగా నటించాను. `పతి పత్ని ఔర్ పంగా` వెబ్ సిరీస్ లో జీవసంబంధమైన పురుషుడిగా జన్మించి ఆ తర్వాత ట్రాన్స్-ఉమెన్ గా మారతాను. సెక్స్ మార్పిడి ఆపరేషన్ నేపథ్యం లో శివ కాస్తా శివానీ అవుతుంది. తరువాత ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ అని వెల్లడించింది అదా.

`పతి పత్ని ఔర్ పంగా` చిత్రానికి అబీర్ సేన్గుప్తా దర్శకత్వం వహించారు. ఈ ప్రదర్శనలో నవీన్ కస్తూరియా- గుర్ ప్రీత్ సైని- హిటెన్ తేజ్వానీ .. ఆల్కా అమిన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇది MX ప్లేయర్ లో ప్రసారం కానుంది.