Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2020 బెస్ట్.. ఈగోని చంపుకుని యోగినిగా మారిన పాల్

2020 బెస్ట్.. ఈగోని చంపుకుని యోగినిగా మారిన పాల్


2020 ముగించి 2021లో అడుగు పెడుతున్నాం. పాత ఈగోలు వదిలి కొత్త ఉల్లాసానికి వెల్ కం చెబుదాం. అయితే ఈ పనిని ఎప్పుడో మొదలు పెట్టింది అమలాపాల్. ఆమె రెబలిజం మాని ఈగోని చంపుకుని యోగినిగా మారింది. మెడలో రుద్రాక్షలు ధరించి ఈగోని తరిమికొట్టేసింది. అంతేకాదు.. యోగాతో పాత ఫ్రస్టేషన్ ని దూరంగా తరిమేసానని నిజాయితీగా అంగీకరించింది. నిజానికి ఇలా అంగీకరించేందుకు గట్స్ ఉండాలి. ఇటీవల యోగా మందిరం నుంచి అమలా పాల్ వరుస ఫోటోలతో పాటు ఆలోచనలను పంచుకుంటోంది. #ది ఈర్ దట్ వజ్.. అంటూ అమలా పాల్ 2020లో తన అద్భుతమైన త్రోబాక్ ఫోటోలను పంచుకోవడంతో మెమరీస్ లోకి వెళ్లింది పాల్.

2020 ప్రపంచానికి `రోలర్-కోస్టర్ రైడ్`. కానీ చాలా మందికి కన్ను తెరిపించింది. ఇది మా కుటుంబ సభ్యులకు మాకు దగ్గరైంది. నిజమైన స్నేహితులు ఏమిటో చూపించింది. 2020లో హెచ్చు తగ్గుల కలబోత. కానీ చిరస్మరణీయమైనవి. నేను జీవితంలో ప్రతిదాన్ని అంగీకరించాను దయ కృతజ్ఞతతో నా మార్గం ఏదో చూపించాను అని పాల్ తెలిపింది.

పాల్ షేర్ చేసిన వాటిలో అద్భుతమైన ఫోటోలలో ఒకటి ఆమె సూర్యాస్తమయాన్ని ఆస్వాధించేది కాగా.. వేరొక ఫోటోలో తన క్యూట్ క్యాట్ తో అంతే అందంగా కనిపించింది. మరొక పోస్ట్ లో కేరళ ఆయుర్వేద చికిత్స తనకు అవసరం అని భావించి చేయించుకుందట. బాధలను అనుభవించడం ద్వారా ప్రతిదీ ఎలా నేర్చుకుందో కూడా ఆమె ప్రస్తావించింది. ఆమె (ఆడై) సినిమాతో అమలాపాల్ పేరు మరోమారు మార్మోగింది. ఆ తర్వాత కూడా ప్రయోగాత్మక చిత్రాల్లో పాల్ నటిస్తోంది. లస్ట్ స్టోరీస్ సిరీస్ లో నందిని రెడ్డి తెరకెక్కించే ఎపిసోడ్ లో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించారు. వేడెక్కించే నటనతో పాల్ అదరగొట్టనుందన్న సమాచారం ఇంతకుముందు రివీలైంది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.