Templates by BIGtheme NET
Home >> Cinema News >> కొరటాలపై అలకబూనిన ప్రముఖ నిర్మాణ సంస్థ…?

కొరటాలపై అలకబూనిన ప్రముఖ నిర్మాణ సంస్థ…?


ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో సమపాళ్లలో అందించే డైరెక్టర్ కొరటాల అని చెప్పవచ్చు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ మరియు ‘భరత్ అనే నేను’.. ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ వంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ క్రమంలో కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి నిర్మిస్తున్నారు.

కాగా ‘శ్రీమంతుడు’ మరియు ‘జనతా గ్యారేజ్’ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ క్రమంలో కొరటాల శివ మైత్రీ మూవీ మేకర్స్ వారితో మరో సినిమాకి వర్క్ చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే కొరటాల శివ మైత్రీ వారితో కాకుండా తన తదుపరి సినిమాని తన ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ యువసుధ బ్యానర్ తో కలిసి చేయబోతున్నాడు. దీంతో మైత్రీ వారు కొరటాల పై అలక బూనారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ బ్యానర్ లో మరో ప్రాజెక్ట్ చేస్తానని కమిట్మెంట్ ఇచ్చి వేరే ప్రొడక్షన్ హౌస్ తో సినిమా తీస్తున్నారని కలత చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే కొరటాల బన్నీ సినిమా తర్వాత ప్రాజెక్ట్ మైత్రీ బ్యానర్ లోనే చేస్తాడనే న్యూస్ కూడా వస్తోంది.

ఇదిలా ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ‘ఉప్పెన’ ‘పుష్ప’ వంటి సినిమాలను పట్టాలెక్కించేసారు. ఈ క్రమంలో మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. పవన్ కళ్యా – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదుపరి ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేయనున్నాడని తెలుస్తోంది.